Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపు ఏపీ ఈసెట్ ప్రవేశ పరీక్ష - రాష్ట్ర వ్యాప్తంగా 103 పరీక్షా కేంద్రాలు

Webdunia
సోమవారం, 19 జూన్ 2023 (13:44 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ ఈసెట్ ప్రవేశ పరీక్ష మంగళవారం జరుగనుంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 103 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాకినాడ జేఎన్టీయూ-కే ఆధ్వర్యంలో ఈ నెల 20న ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్‌‍ను ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు. 
 
ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్, బీఎస్సీ (గణితం) పూర్తిచేసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, ఈ పరీక్షలను రెండు సెషన్లలో ఉదయం 9 నుంచి 12 గంటల వరకూ, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకూ ఆన్‌లైన్‌లో జరుగుతాయని కన్వీనర్ తెలిపారు. పరీక్షల నిర్వహణకు ఏపీ వ్యాప్తంగా 101, తెలంగాణలో 2 మొత్తం 103 కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు.
 
విద్యార్థులు హాల్ టికెట్లను cets.apsche.ap.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు. 23న ప్రాథమిక కీ విడుదల చేస్తామని దీనిపై అభ్యంతరాలను 25 వరకూ స్వీకరిస్తామని జూలై మొదటివారంలో ఫలితాలు ప్రకటిస్తామని తెలిపారు. అభ్యర్థులు ఒక్క నిమిషం అలస్యంగా వచ్చినా పరీక్షా కేంద్రంలోని అనుమతించబోరని తెలిపారు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 8500404562 హెల్ప్ డెస్క్ నంబరులో సంప్రదించాలని సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

తర్వాతి కథనం
Show comments