Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిగ్రీ, బీటెక్ విద్యార్థులకు ఆన్‌లైన్ కోర్సులు.. ఉచితంగా శిక్షణ

Webdunia
శనివారం, 27 జూన్ 2020 (15:25 IST)
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిగ్రీ, బీటెక్ విద్యార్థులకు ఆన్‌లైన్ కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ఆన్‌లైన్ కోర్సుల్లో భాగంగా డిజిటల్ ఫౌండేషన్, వెబ్ డెవలపింగ్, కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ కోర్సులను అందించాలని కీలక నిర్ణయం తీసుకుంది. అయితే కోర్సులను అందించడానికై ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ ఐబీఎంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. 
 
మరోవైపు శాటిలైట్ అనుబంధ అంశాలపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పించి, వాటిలోనూ ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), ఇనిస్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ ముందుకువచ్చాయి. మరిన్ని వివరాల కోసం https://www.apssdc.in/home/ వెబ్ సైట్‌ను సందర్శించవచ్చు.
 
కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో విద్యాసంస్థలన్నీ సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే.  గత మూడు నెలలుగా విద్యార్థులు కాళీగానే ఉంటున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో ఆన్ లైన్ కోర్సుల ద్వారా విద్యార్థులకు మేలు చేయొచ్చునని ఏపీ సర్కారు భావించింది. ఇందులో భాగంగానే ఉచితంగా ఆన్ లైన్ కోర్సులకు రంగం సిద్ధం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈరోజు నుంచి ప్రతి రోజు హిట్ 3 సెలబ్రేషన్ లాగా ఉండబోతుంది: నాని

మరో మెగా వారసుడు రానున్నాడా? తల్లిదండ్రులు కాబోతున్న వరుణ్ - లావణ్య

మిథున్ చక్రవర్తి, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నాకు స్పూర్తినిచ్చారు: చిరంజీవి

ఆశిష్ హీరోగా దిల్ రాజు, శిరీష్‌ నిర్మించనున్న చిత్రానికి దేత్తడి టైటిల్ ఖరారు

సూర్య, పూజా హెగ్డే నటించిన రెట్రో సమీక్ష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments