Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో దారుణం... ఏడో తరగతి విద్యార్థినిపై 22 మంది అత్యాచారం

కామాంధులకు కన్నుమిన్నూ కానరావడంలేదనే దానికి మరో నిదర్శనం. తమిళనాడు చెన్నై మహానగరంలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థినిపై 22 మంది కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డ దారుణ ఘటన వెలుగుచూసింది. ఆమెపై సెక్యూరి

Webdunia
మంగళవారం, 17 జులై 2018 (14:00 IST)
కామాంధులకు కన్నుమిన్నూ కానరావడంలేదనే దానికి మరో నిదర్శనం. తమిళనాడు చెన్నై మహానగరంలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థినిపై 22 మంది కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డ దారుణ ఘటన వెలుగుచూసింది. ఆమెపై సెక్యూరిటీ గార్డులు మొదలుకొని లిఫ్ట్ బోయ్స్, ప్లంబర్ సహా అపార్టుమెంట్లో పనిచేసేవారు మొత్తం 22 మంది అత్యాచారానికి ఒడిగట్టారు. బాలికకు వినికిడి సమస్య వుండటంతో దాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్న కామాంధులు ఈ దారుణానికి తెగబడ్డారు. 
 
ఆమెకు కూల్ డ్రింకులో మత్తు మందు కలిపి అత్యాచారం చేసినట్లు తేలింది. రేప్ చేసిన సమయంలో వీడియో తీసి, ఆమె స్పృహలోకి వచ్చాక ఆ వీడియోలను చూపిస్తూ, విషయాన్ని ఎవరికైనా చెబితే అవన్నీ బయటపెడతామంటూ గత కొన్ని నెలలుగా ఆమెపై అత్యాచారం చేస్తున్నారు. నిందితుల్లో 20 ఏళ్ల యువకుడి నుంచి 66 ఏళ్ల వృద్ధుడి వరకూ వున్నారు. తొలుత తనపై వృద్ధుడే అత్యాచారం చేసాడని ఆ బాలిక వెల్లడించింది. 
 
చెన్నైలోని అయనవరం పెట్రోలు బంకుకు సమీపంలో వున్న ఈ అపార్టుమెంట్ నిర్వహణపై గతంలోనూ చాలా ఆరోపణలు వచ్చాయి. కానీ వీటిపై పోలీసులు పెద్దగా పట్టించుకోకపోవడంతో ఈ దారుణం జరిగింది. కాగా ఇప్పటివరకూ 18 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురు కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

తర్వాతి కథనం
Show comments