గోధుమ రొట్టెలు మృదువుగా వుండాలంటే?

Webdunia
మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (21:57 IST)
గృహిణులు వంటింట్లో అడుగు పెట్టి రుచికరమైన వంటకాన్ని తయారుచేసేందుకు తిప్పలు పడుతుంటారు. కొన్నిసార్లు అనుకున్నదానికంటే ఎక్కువ పాళ్లలో దినుసులు వేయడమో, లేదంటే కారం ఎక్కువగా వేయడమో చేసి పదార్థం రుచి దెబ్బతింటుందని బాధపడుతుంటారు. కొన్ని సమయాల్లో కొన్నింటిని ఇలా అధిగమించవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
 
పసుపు ఎక్కువైతే
కూరలలో పసుపు ఎక్కువయితే కూర ఉంచిన పాత్రపై ఒక శుభ్రమైన బట్టను పరచినట్టుగా కడితే, అది ఎక్కువగా ఉన్న పసుపును పీల్చేసుకుంటుంది.
 
గోధుమ రొట్టెలు
గోధుమలు పిండి పట్టించే ముందు శుభ్రంగా కడిగి ఎండబోసి పట్టిస్తే పిండి మెత్తగా వస్తుంది. ఆ పిండితో చేసిన రొట్టెలు కూడా ఎంతో మృదువుగా ఉంటాయి. 
 
పన్నీరు కలపాలి
గులాబ్ జామూన్ తయారు చేసేందుకు పిండి కలిపేటప్పుడు, ఆ పిండిలో కాస్తంత పన్నీరు కలపాలి. ఇలా చేయడం వల్ల జామూన్‌లు నోట్లో పెడితే కరిగిపోయేలా ఉంటాయి.
 
ఇడ్లీలు మృదువుగా
ఇడ్లీ పిండి రుబ్బే సమయంలో గుప్పెడు అటుకులుకానీ, గుప్పెడు అన్నం కానీ వేశారంటే... ఇడ్లీలు చాలా మృదువుగా ఉంటాయి.
 
కాకరకాయ కూర
కాకరకాయ కూర వండేటప్పుడు వీలైతే అందులో రెండు పచ్చి మామిడి కాయ ముక్కలు వేయాలి. అలా చేస్తే చేదు తగ్గడమే కాకుండా, కూరకు కొత్త రుచి వస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తీవ్రమైన డిప్రెషన్.. టవల్‌తో భార్యను హత్య చేసిన ఇస్రో రిటైర్డ్ అధికారి

రాజమండ్రి జైలు జీవితాన్ని ఎంజాయ్ చేశా... అదొక శిక్షణా కేంద్రం : అంబటి రాంబాబు

Ambati Rambabu: రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విడుదలైన అంబటి రాంబాబు

Sudarshan Reddy: తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ.. సుదర్శన్ రెడ్డికి ఆ ఛాన్స్?

భోపాల్‌లో 'శుభలగ్నం' మూవీ రిపీట్ - రూ.1.5 కోట్లకు భర్తను అమ్మేసిన భార్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తండ్రి కూతురు సెంటిమెంట్ తో డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు ట్రైలర్

Sri Vishnu: విష్ణు విన్యాసం స్ట్రెస్ బస్టర్ లాగా ఉంటుంది : శ్రీ విష్ణు

Anupama: అనుపమ పరమేశ్వరన్ తో అగ్ర నిర్మాణ సంస్థ కొత్త మూవీ ప్రకటన

INCA: ఏప్రిల్ లో ముంబైలో ఘనంగా తొలి INCA అవార్డులు వేడుక

Chiranjeevi: సురేఖ నా భార్య మాత్రమే కాదు, నా బలం, నా అండ, నా ప్రశాంతత : చిరంజీవి

తర్వాతి కథనం
Show comments