Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్కులు ధరించలేదంటే ఆరు నెలల పాటు జైలు శిక్ష ఎక్కడ..?

Webdunia
శుక్రవారం, 12 మార్చి 2021 (09:19 IST)
దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రజలు మాస్కులు లేకుండా బహిరంగ ప్రాంతాల్లో విచ్చలవిడిగా సంచరిస్తుండడం, బహిరంగసభలు, సమావేశాల్లో పాల్గొంటుండడమే దీనికి కారణమని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నీలగిరి కలెక్టర్‌ హెచ్చరికలు జారీ చేశారు. ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక కేంద్రం ఊటీలో మాస్క్‌ ధరించని వారికి ఆరు నెలల జైలుశిక్ష విధిస్తామని నీలగిరి జిల్లా కలెక్టర్‌ ఇన్సెంట్‌ దివ్య హెచ్చరించారు. 
 
ఊటీలోని ప్రజలు గానీ, పర్యాటకులు గానీ మాస్కులు ధరించకుండా సంచరిస్తే ఆరు నెలల జైలుశిక్ష విధిస్తామన్నారు. మాస్కులు లేకుండా సంచరించే వారిని గుర్తించేందుకు 20 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. మాస్కులు ధరించనివారి నుంచి ఇప్పటి వరకూ రూ.30.68 లక్షల జరిమానా వసూలు చేశామన్నారు. 
 
కాగా, మాస్కు ధరించని వారికి ఆరు నెలల జైలుతోపాటు రూ.200 జరిమానా కూడా విధిస్తామని జిల్లా అధికారులు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరిగిపోతుండడంతో ఏపీ, పుదుచ్చేరి, కర్ణాటక మినహా మిగిలిన రాష్ట్రాల నుంచి తమిళనాడు వచ్చేవారు తప్పనిసరిగా ఈపాస్‌ తీసుకోవాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

తర్వాతి కథనం
Show comments