Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరుదైన కేసు.. తల్లి నుంచి బిడ్డకు యాంటీ బాడీలు.. బొడ్డు తాడులో?

Webdunia
బుధవారం, 17 మార్చి 2021 (18:08 IST)
అమెరికాలో కరోనా టీకా తీసుకున్న గర్భిణీ ఇటీవల ప్రసవించింది. దీంతో.. ఆ బిడ్డ శరీరంలో పుట్టుకతోనే కరోనా యాంటీబాడీలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. కరోనా టీకా విషయంలో ఇటువంటి ఘటన జరగడం ప్రపంచంలోనే తొలిసారని వారు చెప్తున్నారు.
 
వివరాల్లోకి వెళితే.. దక్షిణ ఫ్లోరిడాకు చెందిన సదరు మహిళ హెల్త్ కేర్ వర్కర్‌గా సేవలందిస్తుంటుంది. ఏడెనిమిది నెలల గర్భంతో ఉన్నప్పుడు ఆమె మోడర్నా రూపొందించిన కరోనా టీకా తీసుకున్నారు. దీంతో.. తల్లి నుంచి బిడ్డకు కరోనా యాంటీబాడీలు బదిలీ అవుతాయా లేదా అనే ప్రశ్నకు సమాధానం కనుక్కునేందుకు వారు ప్రయత్నిస్తున్నారు.
 
అయితే.. టీకా తీసుకున్న మూడు వారాలకు ఆమె బిడ్డను ప్రసవించింది. అయితే.. కాన్పు తరువాత బొడ్డు తాడులో యాంటీబాడీలను గుర్తించినట్టు వైద్యులు డా. పాల్ గిల్బర్ట్, డా. ఛాడ్ రడ్నిక్ పేర్కొన్నారు. గర్భిణులకు ఇతర టీకాల ఇచ్చాక తల్లి నుంచి బిడ్డకు యాంటీబాడీలు చేరుతాయి. 
 
కరోనా టీకా విషయంలోనూ ఇదే విధంగా జరుగుతుందని తొలిసారి బయటపడిందని చెప్పారు. అయితే.. ఈ యాంటీబాడీలు శిశువుకు కరోనా నుంచి రక్షణ నిస్తాయో లేదో తెలుసుకునేందుకు మరింత అధ్యయనం అవసరమని వారు స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో సయారా విడుదలతేదీ ప్రకటన

మంచు విష్ణు పోస్ట్ పై సోషల్ మీడియాలో వైరల్

Krishna Bhagwan: పవన్ కల్యాణ్‌పై కృష్ణ భగవాన్ వ్యాఖ్యలు.. పొగిడారా? లేకుంటే తిట్టారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments