ఆంధ్రాలో కొత్తగా 1190 కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
ఆదివారం, 12 సెప్టెంబరు 2021 (18:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మరో 1190 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్యపై ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. 
 
మొత్తం 45,533 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, వీరిలో 1,190 మందికి పాజిటివ్ అని తేలింది. ఈ కేసుల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 219 కొత్త కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో 164, నెల్లూరు జిల్లాలో 139, ప్రకాశం జిల్లాలో 121 కేసులు గుర్తించారు. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 10 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
 
అదేసమయంలో 1,226 మంది కరోనా నుంచి కోలుకోగా, 11 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,29,985 పాజిటివ్ కేసులు నమోదు కాగా 20,00,877 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 15,110 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 13,998కి పెరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రీసెంట్‌గా వచ్చిన చిత్రంలోలాగా మా చిత్రంలో ఏఐ ఉపయోగించలేదు : నిఖిల్

విజయ్ చిత్రం జన నాయగన్ విడుదల ఇప్పట్లో లేనట్టేనా?

హిమాన్షీ ఖురానాకు బెదిరింపులు - రూ.10 కోట్లు డిమాండ్

​అతి ప్రేమ భయానకం అంటూ వస్తోన్న 100 డేస్ లవ్ స్టోరీ

Garuda Ram: నాగబంధం నుంచి బైరాగి గా గరుడ రామ్‌ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం

మొలలు లేదా పైల్స్ వున్నవారు తినకూడని పదార్థాలు ఏంటి?

Pink salt : పింక్ సాల్ట్ ఆరోగ్య ప్రయోజనాలు.. ఇందులో అయోడిన్ ఉండదు

Valentines Day: వాలెంటైన్స్ డే.. ఎర్ర గులాబీల ఔచిత్యం.. సెయింట్ వాలెంటైన్ గౌరవార్థం..

అల్లంతో కండరాల నొప్పి, బహిష్టు నొప్పి తగ్గుతుంది

తర్వాతి కథనం
Show comments