డ్రైవ్‌-ఇన్‌-కోవిడ్‌ పరీక్షా కేంద్రాలు.. హైదరాబాదులో మొదటిసారిగా..?

Webdunia
శనివారం, 24 ఏప్రియల్ 2021 (10:26 IST)
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో డ్రైవ్-ఇన్- రెస్టారెంట్ల తరహాలో డ్రైవ్‌-ఇన్‌-కొవిడ్‌ పరీక్షా కేంద్రాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఆ కేంద్రానికి వెళ్లి కారు దిగకుండానే కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకుని నిర్దేశించిన గడువులోపు ఫలితం పొందవచ్చు. హైదరాబాద్‌లో మొదటిసారిగా ఇలాంటి కేంద్రాన్ని అపోలో డయాగ్నస్టిక్స్‌ సంస్థ శుక్రవారం హైటెక్‌ సిటీ ప్రాంతంలో అందుబాటులోకి తీసుకువచ్చింది. 
 
మాదాపూర్‌లోని మెరిడియన్‌ స్కూల్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో ప్రతి రోజూ (ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు) 250 మందికి ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేయనున్నారు. పరీక్ష కోసం ఇక్కడికి వచ్చిన తరువాత సెల్‌ఫోన్‌ ద్వారా క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి అందులో వివరాలు నమోదు చేయాలి. వెంటనే సెల్‌ఫోన్‌లో టోకెన్‌ జారీ అవుతుంది. 
 
తర్వాత పరీక్ష రుసుమును ఆన్‌లైన్‌లో చెల్లించాలి. టోకెన్‌ నంబర్‌ ఆధారంగా డయాగ్నస్టిక్స్‌ కేంద్రం నిపుణులు కారు వద్దకు వచ్చి నమూనా సేకరిస్తారు. 48 నుంచి 72 గంటల్లో ఫలితాన్ని ఆన్‌లైన్‌లో అందిస్తారు. ఇలాంటి కేంద్రాలను నగరంలో మరిన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kamalhasan: కమల్ హాసన్ చిత్రం సెయాన్ లో శివకార్తికేయన్ ఫస్ట్ లుక్

ధర్మస్థల నియోజకవర్గం లో డ్యాన్సర్ శ్రష్టి వర్మ సింగిల్

Nagabandham teaser: పాన్ ఇండియా టాప్ ట్రెండింగ్‌లో నాగబంధం టీజర్

Sunil: కాటాలన్ ఐటెం నంబర్‌లో అదరగొట్టిన సునీల్

త్రిషపై బీజేపీ నేత ఫైర్- అలాంటి వ్యాఖ్యలు అసహ్యకరమైనవి... లాయర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?

హైదరాబాద్‌లో టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను నిర్వహించిన టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్

ప్రేమకు సరికొత్త భాష: శ్రద్ధను, ఉద్దేశాన్ని చాటిచెప్పే వాలెంటైన్స్ డే బహుమతులు

చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం

మొలలు లేదా పైల్స్ వున్నవారు తినకూడని పదార్థాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments