Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా బాధితుల కోసం తన కార్యాలయాన్ని ఐసియూగా మార్చిన షారూక్ ఖాన్

Webdunia
మంగళవారం, 11 ఆగస్టు 2020 (15:30 IST)
కరోనా సమయంలో చాలామంది హీరోలు తమ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కూడా ఒకరు. ముంబై లోని తన కార్యాలయాన్ని కరోనా బాధితుల కోసం ఐసీయుగా మార్చి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు తమ వంతు సాయం అందించారు.
 
అందులో అక్షయ్, సోనూ సూద్ వంటి వారు కరోనా కష్టకాలంలో ఎంతోమందిని ఆదుకున్నారు. షారుక్ ఖాన్ తన స్టార్‌డమ్‌ను సరైన విషయాల కోసం ఉపయోగించటానికి ఎప్పుడు ముందువరుసలో ఉంటాడు. షారూక్ తన కార్యాలయంలో 15 పడకల ఐసియును ఏర్పాటు చేశారు. దీంతో 66 మంది కరోనా బాధితులను అక్కడ చేర్చారు.
 
వారిలో 54 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. షారూక్ ఖాన్ యొక్క మీర్ పౌండేషన్, హిందుజా హాస్పిటల్ మరియు బిఎంసి సహకారంతో 15 పడకల ఐసియు సిద్ధమయ్యింది. ఖార్ లోని హాస్పిటల్లో లిక్విడ్ ఆక్సిజన్ నిల్వ ట్యాంకులను కలిగి వుందని, వెంటిలేటర్, ఆక్సిజన్ లైన్లతో క్లిష్టమైన రోగులకు సేవలు అందిస్తున్నామని ఖార్ లోని హిందుజ హాస్పిటల్ డాక్టర్ అవినాష్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

తర్వాతి కథనం
Show comments