Webdunia - Bharat's app for daily news and videos

Install App

corona: 2 లక్షల దిగువకు కొత్త కేసులు, 4 వేలకు దిగువకు మరణాలు

Webdunia
మంగళవారం, 25 మే 2021 (20:09 IST)
దిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి నిలకడగా తగ్గుముఖం పడుతోంది. చాలా రోజుల అనంతరం తాజాగా కొత్త కేసులు రెండు లక్షల దిగువకు చేరడం ఊరట కలిగిస్తోంది. ఇక మరణాల సంఖ్య కూడా కాస్త తగ్గింది. క్రితంరోజు నాలుగు వేలకు పైగా మరణాలు నమోదు కాగా.. తాజాగా ఆ మార్కుకు దిగువన నమోదయ్యాయి. మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం..
 
సోమవారం 20,85,112 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 1,96,427మందికి పాజిటివ్‌గా తేలింది. ఏప్రిల్ 14 తర్వాత ఆ స్థాయిలో తగ్గుదల కనిపించడం ఇదే మొదటిసారి. ఇక 24 గంటల వ్యవధిలో 3,511 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం మొత్తం కేసుల సంఖ్య 2,69,48,874కి చేరగా..3,07,231 మంది ప్రాణాలు వదిలారు.
 
ఇక క్రియాశీల కేసుల సంఖ్యలో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. ప్రస్తుతం 25,86,782 మంది కొవిడ్‌తో బాధపడుతుండగా.. క్రియాశీల రేటు 10.17 శాతానికి చేరింది. నిన్న 3,26,850 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 2.4 కోట్లకు పైబడ్డాయి. రికవరీ రేటు 88.69 శాతంగా కొనసాగుతోంది. మరోవైపు నిన్న 24,30,236 మందికి కేంద్రం టీకాలు అందించింది. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 19,85,38,999కి చేరింది..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments