20 వేల దిగువకు కరోనా కేసులు - మూడు లక్షల దిగువకు క్రియాశీల కేసులు

Webdunia
మంగళవారం, 22 డిశెంబరు 2020 (15:51 IST)
భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం..సోమవారం 20వేలకు దిగువకు చేరాయి. 19,556 కొత్త కేసులు వెలుగుచూశాయి. జులై ప్రారంభంలో మాత్రమే ఈ స్థాయిలో కేసులు బయటపడ్డాయి. దాంతో ఇప్పటివరకు 1,00,75,116 మంది వైరస్ బారిన పడ్డారు.
 
ఇక క్రియాశీల కేసుల్లో భారీ తగ్గుదల కనిపిస్తోంది. ఆ కేసులు మూడు లక్షల దిగువకు చేరి..2,92,518గా ఉన్నాయి. క్రియాశీల రేటు 2.90శాతానికి చేరగా..రికవరీ రేటు 95.65శాతంగా ఉంది. ఇప్పటి వరకు 96,36,487 మంది వైరస్ నుంచి కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. వరసగా పదో రోజు కూడా మరణాల సంఖ్య 400ల దిగువకు పడిపోయింది. గడిచిన 24 గంటల్లో 301 మంది మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 1,46,111గా ఉంది. అలాగే ఐసీఎంఆర్ గణాంకాల ప్రకారం..10,72,228 మందికి నిన్న వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
 
ప్రతి పది లక్షల మందిలో.. దేశంలో ప్రతి పది లక్షల మందిలో వైరస్ బారిన పడినవారు, సంభవించిన మరణాలు, అలాగే నిర్వహించిన టెస్టుల సంఖ్యను మంత్రిత్వ గ్రాఫ్ రూపంలో విడుదల  చేసింది. 7,286.6 మంది వైరస్ బారిన పడగా, 105.7 మరణాలు సంభవించాయి. అలాగే 1,17,462.6 పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

MAA Dairy: మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్ డైరీ ఆవిష్కరించిన భట్టి విక్రమార్క మల్లు

Rajiv Kanakala: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు సిరీస్ ప్రతీ తండ్రికి కనెక్ట్ అవుతుంది : కె.వి. శ్రీరామ్

Mrinal: డెకాయిట్‌ కథ డేంజర్‌, అయినా ఫస్ట్ సింగిల్ రుబరూ లో శేష్, మృణాల్ కెమిస్ట్రీ హైలైట్

Netflixలో సైకాలజికల్ డ్రామా Accused ట్రైలర్‌ విడుదల

Harish Shankar: ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం నో రాజకీయాలు ఓన్లీ ఎంటర్ టైన్ మెంట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

కాలేయానికి మేలు చేసే పసుపు కలిపిన ఉసిరి రసం, ఇంకా ఏమేమి ప్రయోజనాలు?

మంచి కోడిగుడ్లు, మంచి పాలు వెతుక్కోవాల్సి వస్తోంది, ఎందుకంటే?

బైపాస్ సర్జరీ శాశ్వత పరిష్కారం కాదు, కొత్త బ్లాకేజీలపై అప్రమత్తత అవసరం

మెరుగైన శ్వాసకోశ ఆరోగ్యం కోసం పిపెయిర్‌ను విడుదల చేసిన జైడస్

తర్వాతి కథనం
Show comments