Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో పెరిగిపోతున్న కేసులు... ప్రైవేటు వైద్య కాలేజీలో కరోనా పరీక్షలు

Webdunia
ఆదివారం, 12 ఏప్రియల్ 2020 (18:13 IST)
దేశంలో కరోనా వైరస్ కేసులో నానాటికీ పెరిగిపోతున్నాయి. ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం లాక్‌డౌన్‌ను అమలు చేస్తోంది. అయినప్పటికీ, ఈ కేసులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. ఫలితంగా దేశ వ్యాప్తంగా మొత్తం 8731 కేసులు నమోదయ్యాయి. అలాగే, 295 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 845 మంది ఈ వైరస్ బారినపడి కోలుకున్నారు. 
 
ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు లక్ష 87 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని తెలిపింది. 151 పరీక్ష కేంద్రాల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించింది. ప్రైవేటు ఆసుపత్రుల సేవలను కూడా వినియోగించుకుంటున్నామని, కరోనా పరీక్షలు చేసేందుకు ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
 
ఇకపోతే, దేశ వ్యాప్తంగా నమోదైన కేసుల వివరాలను పరిశీలిస్తే, అత్యధికంగా మహారాష్ట్ర్లో 1895, ఢిల్లీలో 1069, తమిళనాడుల 969, తెలంగాణాలో 407, ఆంధ్రప్రదేశ్‌లో 406, రాజస్థాన్‌లో 796, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 532, గుజరాత్‌లో 493, ఉత్తరప్రదేశ్‌లో 452, కేరళలో 373, జమ్మూకాశ్మీర్‌లో 224, కర్నాటకలో 226, హర్యానాలో 179, పంజాబ్‌లో 158, వెస్ట్ బెంగాల్‌లో 132, బీహార్‌లో 64, ఒరిస్సాలో 54 చొప్పున కేసులు నమోదయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments