Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో మూడు కొత్త కేసులు.. కర్ఫ్యూ అమలుకు కేంద్రం సూచన?

Webdunia
మంగళవారం, 24 మార్చి 2020 (13:31 IST)
తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 36కి చేరింది. జర్మనీ నుంచి వచ్చిన హైదరాబాద్‌లోని చందానగర్‌కు చెందిన మహిళలకు కరోనా నిర్ధారణ అయింది. సౌదీ అరేబియా నుంచి బేగంపేటకు వచ్చిన మరో మహిళకు కరోనా ఉన్నట్లు తేలింది. అలాగే లండన్‌ నుంచి వచ్చిన కూకట్‌పల్లి వాసికి కూడా కరోనా వైరస్ సోకినట్టు వైద్య పరీక్షల్లో తేలింది. దీంతో ఈ ముగ్గురుని ఆస్పత్రికి తరలించి క్వారంటైన్‌లో చికిత్స అందిస్తున్నారు. అలాగే, వారి కుటుంబ సభ్యులను కూడా హోం క్వారంటైన్‌లో ఉంచి వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. 
 
మరోవైపు, దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. అయితే, ఈ లాక్‌డౌన్ ఆంక్షలను ప్రజలు యధేచ్చగా ఉల్లంఘించి రోడ్లపైకి వస్తున్నారు. ఇలాంటి చర్యల వల్ల కరోనా కట్టడికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు నీరుగారిపోయే అవకాశాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది.
 
లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలను జారీచేసింది. అవసరమైతే చట్ట ప్రకారం కర్ఫ్యూని విధించాలని సూచించింది. కర్ఫ్యూ అమల్లోకి వస్తే... ఎవరూ కూడా రోడ్లపై కనిపించడానికి కూడా వీలుండదు. ఎవరైనా రోడ్లపైకి వస్తే పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకుని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments