Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ దుర్గగుడిలో కరోనా కలకలం, ఈవో సహా 18 మందికి పాజిటివ్

Webdunia
శుక్రవారం, 7 ఆగస్టు 2020 (13:36 IST)
నిత్యం భక్తులతో కళకళలాడే విడయవాడ దుర్గ గుడిలో కరోనా కల్లోలం రేపుతుంది. కరోనా వ్యాప్తి కారణంగా రెండున్నర నెలలకు పైగా గుడిని మూసివేసిన అధికారులు తాజాగా కేంద్రం ఆంక్షలు సడలింపుతో తిరిగి దర్శనాలు ప్రారంభించారు. అయితే పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తున్నా కరోనా వ్యాప్తి చెందుతుండటంతో వాటిలోను కోతలు పెట్టారు.
 
ఇదంతా సాగుతుండగా తాజాగా ఆలయ నిర్వహణాధికారి సరేశ్‌తో పాటు 18 మంది సిబ్బందికి కరోనా సోకినట్లు తేలింది. తాజాగా నిర్వహించిన పరీక్షలో వీరికి వైరస్ సోకినట్లు నిర్థారించారు. ఇవాళ అసలే శ్రావణ శుక్రవారం కావడం, భక్తులు ఎక్కువగా ప్రత్యేక పూజలు కోసం తరలి వస్తుండటంతో కరోనా భయాలు మరింత పెరిగాయి.
 
ఇప్పటికే ఆలయంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న దాఖలాలు కనిపిస్తున్నా భక్తుల రాక మాత్రం తగ్గలేదు. దీంతో అధికారులు కూడా తలలు పట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. భక్తులను వెనక్కు పంపలేని పరిస్థితిలో దర్శనాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తున్నది. అధికారులకు కరోనా సోకడంతో ఆలయాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించేటట్లు చర్యలు జరుగుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

రజనీకాంత్ రిటైర్మెంట్ చేస్తారంటే... కామెంట్స్ చేసిన లతా రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments