Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో 122 మందికి కరోనా పాజిటివ్ - ఒమిక్రాన్ కేసులు నిల్

Webdunia
సోమవారం, 3 జనవరి 2022 (18:12 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మరో 122 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 15,568 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా, 122 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. 
 
ఇందులో కృష్ణా జిల్లాలో 19, చిత్తూరు జిల్లాలో 13, గుంటూరు జిల్లాలో 10 కేసులు చొప్పున నమోదయ్యాయి. విజయనగరం, వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
మరోవైపు, రాష్ట్రంలో ఒక్క ఒమిక్రాన్ కేసు కూడా నమోదు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అదేసమయంలో కరోనా నుంచి 103 మంది కోలుకున్నారు. అయితే, విశాఖలో మాత్రం ఓ కరోనా రోగి ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,77,608 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ప్రస్తుతం 1,278 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి హీరోయిన్ రాశీ సింగ్ గ్లింప్స్ రిలీజ్

వరుస సినిమాలు సిద్ధమవుతున్న డ్రింకర్ సాయి ఫేమ్ హీరో ధర్మ

Rashmika: పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో కుబేర - రష్మిక మందన్న న్యూ లుక్

Srileela: జాన్వీకపూర్ ప్లేస్ లో శ్రీలీల - కారణం డేటింగేనా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments