Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాకు కొత్త లక్షణాలు వచ్చాయ్.. వాంతులొస్తే జాగ్రత్త..!

Webdunia
శుక్రవారం, 3 జులై 2020 (12:27 IST)
కరోనాకు కొత్త లక్షణాలు వచ్చాయ్.. అందుకే చాలా జాగ్రత్తగా వుండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కరోనా లక్షణాలు రోజు రోజుకు మారుతూనే వున్నాయి. సాధారణంగా దగ్గు, జ్వరం, జలుబు వంటి లక్షణాలుంటే వాటిని కరోనాగా గుర్తించేవారు. ఆ తరువాత అందులో అనేక కొత్త లక్షణాలు వచ్చి చేరాయి. 
 
కరోనా సోకిన రోగుల్లో ఇప్పుడు మరికొన్ని కొత్త లక్షణాలను గుర్తించారు. అవే వికారం, వాంతులు, ఒళ్ళు నొప్పులు. కరోనా సోకిన రోగులకు వికారంగా ఉండటం ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో పాటు చాలామందికి వాంతులు అవుతున్నాయి. మోకాళ్ళ నుంచి కింది భాగంలో నొప్పులు ఉండటాన్ని అధికారులు గుర్తించారు. 
 
ఇక మరికొంత మందిలో ఈ వాంతులతో పాటుగా డయేరియా లక్షణాలు కూడా కనిపిస్తున్నాయని, జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కొంతమందిలో షుగర్ లెవల్స్ తక్కువగా ఉండటం కూడా కరోనా లక్షణంగా గుర్తించినట్టు కరోనా టాస్క్ ఫోర్స్ సభ్యులు చెప్తున్నారు. ఇలాంటి వారికి ఇన్సులిన్ ఇవ్వాల్సి వస్తుందని అన్నారు. 
 
దురద, దద్దుర్లు వంటివి కనిపిస్తున్నాయని.. కరోనా వైరస్ రూపాంతరం చెందుతుండటం వలన లక్షణాలు కూడా మారుతున్నాయని వైద్యులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments