Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లాస్మా థెరపీ వల్ల ఉపయోగం లేకుండా పోయింది, ఐసీఎంఆర్ అధ్యయనంలో వెల్లడి

Webdunia
బుధవారం, 16 సెప్టెంబరు 2020 (14:35 IST)
ప్లాస్మా థెరపీ వల్ల కరోనా మరణాలు తగ్గించవచ్చంటూ నిన్నమొన్నటి వరకు వార్తలు వచ్చాయి. పలు రాష్ట్రాలు ప్లాస్మా బ్యాంకులను కూడా ఏర్పాటు చేశారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత దానం చేసే ప్లాస్మా వల్ల ప్రాణాలు నిలబడతాయనే ఉద్దేశంతో ప్లాస్మా దానానికి పలువురు ముందుకొచ్చారు .అయితే తాజాగా భారతీయ వైద్య పరిశోధన మండలి వెల్లడించిన విషయాలు దిగ్భ్రాంతికి గురిచేశాయి.
 
14 రాష్ట్రాలలోని 39 ఆస్పత్రుల్లో 469 మంది బాధితులపై చేసిన అధ్యయనంలో ఆందోళనకరమైన విషయాలు వెల్లడయ్యాయి. కోవిడ్ మరణాలను ప్లాస్మా థెరపీ ఏమాత్రం తగ్గించలేక పోయిందని ఈ అధ్యయనంలో తేలింది. ఈ మేరకు ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ తెలిపారు. మరణాలతో పాటు రోగ తీవ్రతను కూడా ఇది తగ్గించలేక పోయిందని పేర్కొన్నారు.
 
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్‌తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ అధ్యయన వివరాలు ఇంకా ప్రచురితం కాలేదు. దీనిపై శాస్త్రవేత్తల సమీక్ష కొనసాగుతోంది. సమీక్ష పూర్తయిన అనంతరం అధ్యయనం ప్రచురితం కానుంది.
 
అధ్యయనంలో వెల్లడైన విషయాలను టాస్క్ పోర్స్, వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త పర్యవేక్షక బృందం పరిశీలించిన అనంతరం ప్లాస్మా థెరపీ విధానాన్ని కొనసాగించాలా, వద్దా అన్న విషయాన్ని నిర్ణయిస్తామని భార్గవ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్‌‍తో డేటింగ్ చేస్తా .. ప్రభాస్‌ను పెళ్ళాడతా : ఫరియా అబ్దుల్లా

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments