Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేడి నీళ్ళతో స్నానం చేస్తే కరోనా వైరస్ చనిపోతుందా? (video)

Webdunia
మంగళవారం, 24 మార్చి 2020 (16:17 IST)
భారత్‌తో పాటు.. ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్ కరోనా వైరస్. ఈ వైరస్ ధాటికి అనేక మంది పిట్టల్లా రాలిపోతున్నారు. లక్షలాది మంది ఈ వైరస్ బారిపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొందరు ఈ వైరస్ బారినపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటుంటే.. ఈ వైరస్ బారినపడినవారు త్వరగా కోలుకునేందుకు తమకు తోచిన పద్ధతులను అవలంభిస్తున్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా నుంచి రక్షణ పొందే సలహాలు, సూచనలే తీసుకోవాలి. అపోహలు, అయోమయానికి గురిచేసే వార్తలకు దూరంగా ఉండాలి. 
 
ముఖ్యంగా, చాలా మందికి ఎండలో నిలబడినా, లేక వేడినీళ్ళతో స్నానం చేసినా ఈ వైరస్ చనిపోతుందన్న అపోహతో పాటు.. బాహ్యప్రపంచంలో ప్రచారం ఎక్కువగానే జరుగుతుంది. దీనిపై వైద్యులను సంప్రదిస్తే, నీళ్ళు బాగా తాగడం వల్ల కరోనా వైరస్‌ ఒంట్లో నుంచి పోతుందని అనుకోవడం అపోహే. అలాగే, ఐస్‌ క్రీములు తిన్నంత మాత్రాన వైరస్‌ స్తంభించిపోతుందని అనుకోవడమూ తప్పే!
 
అలాగే, వేడి నీళ్లతో స్నానం చేసినా, అలాగే హ్యాండ్‌ డ్రయ్యర్లు వాడినా వైరస్‌ చనిపోతుందని అనుకోవడం పొరపాటు. అలాగే, ఎండలో నిలబడినంత మాత్రాన వైరస్‌ పోదు. ఒంటి మీద ఆల్కహాల్‌ స్ర్పే చేసుకున్నా, లేదంటే ఆల్కహాల్‌ తాగినా వైరస్‌ చనిపోతుందనుకోవడం అపోహ. ఫ్లూ టీకాలు వేసుకుంటే కొవిడ్‌ 19 వైరస్‌ నుంచి రక్షణ లభిస్తుందనే ప్రచారం అర్థరహితమే. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments