Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్-బ్రిటన్ విమానాలు బంద్.. మరికొంత కాలం ఇదే తంతు

Webdunia
బుధవారం, 30 డిశెంబరు 2020 (09:53 IST)
కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ నేపథ్యంలో ఈ నెల 23 నుంచి 31 వరకు భారత్-బ్రిటన్ మధ్య విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసిన భారత ప్రభుత్వం దానిని మరికొంత కాలం పొడిగించాలని నిర్ణయించింది. దేశంలోనూ కొత్త వైరస్ జాడలు గుర్తించడంతో నిషేధాన్ని మరింత కాలం పొడిగించే అవకాశం ఉందని పౌర విమానయాన మంత్రి హర్‌దీప్‌సింగ్ పూరి పేర్కొన్నారు. 
 
వైరస్‌ను కట్టడి చేయడంతోపాటు ఇరు దేశాల మధ్య విమాన సేవలకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. వందే భారత్ మిషన్ ద్వారా 42 లక్షల మంది భారతీయులను విదేశాల నుంచి తీసుకొచ్చినట్టు మంత్రి చెప్పారు. వీరిలో కేరళకు చెందిన 8 లక్షల మంది ఉన్నట్టు తెలిపారు. 
 
తెలంగాణకు 1,84,632 మంది వచ్చినట్టు పేర్కొన్నారు. కరోనాకు ముందు 40 దేశాలకు రాకపోకలు సాగించిన ఎయిర్ ఇండియా కరోనా సమయంలో 75 దేశాల నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చినట్టు మంత్రి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments