Webdunia - Bharat's app for daily news and videos

Install App

2020ని కరోనా మింగేస్తుందా? కెన్యా కీలక నిర్ణయం.. ఏంటది?

Webdunia
మంగళవారం, 7 జులై 2020 (22:04 IST)
2020 సంవత్సరాన్ని కరోనా మింగేసేలా వుంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ.. కెన్యా కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రరాజ్యంతో పాటు ఇతర దేశాలు కరోనాను తరిమికొట్టేందుకు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఇప్పటికే లాక్ డౌన్ విధిస్తూ.. కరోనాను నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నాయి.

ఇందులో భాగంగా పాఠశాలలు మూతపడ్డాయి. ఫలితంగా ఆన్‌లైన్ క్లాసులు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కెన్యా దేశం కీలక నిర్ణయం తీసుకుంది. 2020లో స్కూళ్లు తెరవకూడదని నిర్ణయించింది. 
 
2021లో మళ్లీ స్కూల్స్ తెరవనున్నట్లు ప్రకటించింది. కెన్యా విద్యా శాఖ కేబినెట్ సెక్రటరీ ప్రొఫెసర్ జార్జ్ మగోహా ప్రకటించారు. కెన్యాలో కరోనా తీవ్రత రానురాను పెరుగుతోందని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో స్కూల్స్ తెరవడం శ్రేయస్కరం కాదని మగోహ తెలిపారు. 
 
విద్యా సంవత్సరం వృధా అవుతుందని, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పదని..  అయితే.. ఈ విద్యా సంవత్సరంలో ఏ క్లాస్ చదువుతున్నారో.. 2021లో మళ్లీ అదే క్లాస్‌లో చదవాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కరోనా నేపథ్యంలో కెన్యాలో మార్చి 15 నుంచి స్కూల్స్ మూతపడ్డాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments