Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతా కొత్త కరోనా తలనొప్పి-మహారాష్ట్రలో జనవరి 31 వరకు లాక్ డౌన్..

Webdunia
బుధవారం, 30 డిశెంబరు 2020 (14:06 IST)
దేశంలో కరోనా వైరస్ కొత్త రకం వ్యాప్తి చెందుతోంది. ఈ నేపథ్యంతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. కరోనా వ్యాప్తిని నిలువరించడానికి రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను మరో నెలరోజులపాటు పొడిగించింది. జవవరి 31 వరకు లాక్‌డౌన్‌ నిబంధనలు అమలులో ఉంటాయని ఆదేశాలు జారీచేసింది. ఇప్పటికే మున్సిపాలిటీల్లో రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నది. వచ్చేనెల జనవరి 5 వరకు పట్టణ ప్రాంతాల్లో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాత్రిపూట కర్ఫ్యూ అమల్లో ఉండనుంది.
 
కాగా, పుణేలో ఇప్పటికే ఒకరికి కరోనా కొత్త వైరస్‌ సోకింది. మొత్తం 50 మంది నమూనాలను పరీక్షించగా ఒకరికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో వారి కుటుంబ సభ్యులను ఐసోలేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో యూకే నుంచి వస్తున్న వారిపై అధికారులు నిఘా పెంచారు.
 
దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. రాష్ట్రంలో ఇప్పటివరకు 19,25,066 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 49,373మంది మరణించగా, 55,672 మంది చికిత్స పొందుతున్నారు. దేశంలోని ఐదు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 60 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. అందులో కూడా మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments