వామ్మో... ఏపీలో దుమ్ముదులుపుతున్న కరోనా వైరస్

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (18:22 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ దుమ్ముదులుపుతుంది. కొత్తగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య మరింతగా పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లో ఏకంగా మరో 12615 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధితంగా చిత్తూరు జిల్లాలోనే 2338 కరోనా కేసులు వెలుగుచూశాయి. 
 
ఇదే అంశంపై ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన మేరకు గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 12338 కరోనా కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో అత్యల్పంగా 216 కేసులు వెస్ట్ గోదావరి జిల్లాలో నమోదయ్యాయి. 
 
అలాగే, ఈ కరోనా వైరస్ కారణంగా నలుగురు మృతి చెందగా మరో 3674 మంది కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 21,40,056కు చేరింది. అలాగే, 20,71,658 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 14527 మంది చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 53871 యాక్టివ్ కేసులు ఉండగా, వీరంతా వివిధ ఆస్పత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స పొందుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Satyadev :ఎకోలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా సమవర్తి నుంచి సత్యదేవ్ లుక్

Aadi: వసుదేవసుతం ఫ్యామిలీ ఎంటర్ టైనర్ : ఆది

అడిగి తీసుకుంటే భిక్ష - అడగకుండా ఇస్తే అసలైన విలువ : రాజేంద్ర ప్రసాద్

SS Rajamouli: వారణాసి అప్ డేట్ తో ఎం.ఎం. కీరవాణి పుట్టినరోజు వేడుక

Narne Nithin :నార్నే నితిన్, అనికా సురేంద్రన్, మేఘా శెట్టి కాంబినేషన్ లో చిత్రం

తర్వాతి కథనం
Show comments