Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరికొన్ని రాష్ట్రాలకు కోవాగ్జిన్ సరఫరా : కేంద్రం ఏర్పాట్లు

Webdunia
ఆదివారం, 24 జనవరి 2021 (15:56 IST)
ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా, అందుబాటులోకి వచ్చిన కోవాగ్జిన్ సరఫరా దేశంలో సాగుతోంది. ఇప్పటికే ఈ కరోనా టీకాల వినియోగం ప్రారంభమైంది. ఈ టీకాల వినియోగంలో అక్కడక్కడా అపశృతులు దొర్లుతున్నాయి. అయితే, కేంద్రం ఇవేమీ పట్టించుకోకుండా ముందుకుసాగుతోంది. 
 
ఈ క్రమలో పూణె కేంద్రంగా పని చేస్తున్న భారత్ బయోటెక్ ఉత్పత్తి చేసిన కరోనా టీకా కొవాగ్జిన్‌‌ను మరో ఏడు రాష్ట్రాల్లో వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. పంజాబ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, జార్ఖండ్, కేరళ, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్‌లో వచ్చే వారం నుంచి కొవాగ్జిన్‌ను ఇవ్వనున్నట్టు కేంద్రం ప్రకటించింది. 
 
కాగా, శనివారం లక్షా 46 వేల 598 మందికి వ్యాక్సిన్ వేశారు. దీంతో మొత్తం లబ్ధిదారుల సంఖ్య 15.37 లక్షలకు చేరింది. ఇప్పటిదాకా వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్ వచ్చిన ఘటనలు 123 నమోదు కాగా.. శనివారం ఒక్కటి కూడా రాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 
 
మొత్తం సైడ్ ఎఫెక్ట్స్ ఘటనల్లో 11 మందికి మాత్రమే పరిస్థితి విషమించిందని, ఏడుగురు చనిపోయారని వెల్లడించింది. ఈ చనిపోయినవారిలో ఏపీలోని గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన లక్ష్మీ అనే ఆశావర్కర్ కూడా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినీ బృందం (video)

Tabu: పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి చిత్రంలో టబు ఎంట్రీ

యాదార్థ సంఘటనల ఆధారంగా ప్రేమకు జై సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments