Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామ్మో వైరస్‌లు.. దేశంలో తొలి స్కిన్‌ బ్లాక్‌ ఫంగస్‌ కేసు

Webdunia
బుధవారం, 2 జూన్ 2021 (09:53 IST)
ఓ వైపు దేశంలో కరోనా పంజా విసురుతోంది. మరో వైపు బ్లాక్‌ ఫంగస్‌తో పాటు వైట్‌ ఫంగస్‌, ఎల్లో ఫంగస్‌ కేసులు సైతం రికార్డవుతున్నాయి. తాజాగా స్కిన్‌ బ్లాక్‌ ఫంగస్‌ వెలుగు చూసింది. దేశంలోనే మొదటి కేసు కర్ణాటకలోని చిత్రదుర్గలో నమోదవగా.. ఒక్కసారిగా కలకలం సృష్టించింది. చిత్రదుర్గకు చెందిన 54 ఏళ్ల రోగికి స్కిన్ మ్యూకోయిడ్ మైకోసిస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని వైద్యులు తెలిపారు. 
 
దేశంలో తొలి స్కిన్‌ బ్లాక్‌ ఫంగస్‌ కేసు ఇదేనని పేర్కొన్నారు. బాధితుడు నెల రోజుల కిందట కరోనా బారినపడి కోలుకున్నాడు. బాధితుడికి మధుమేహం సైతం ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. బాధితుడి కుడి చెవి దగ్గర ఉన్న చర్మంలో బ్లాక్‌ ఫంగస్‌ కనిపించిందని వైద్యులు తెలిపారు. ఇప్పటికే ఆ బాధితుడికి మొదటి దశ శస్త్రచికిత్స ద్వారా చర్మంపై ఉన్న బ్లాక్‌ ఫంగస్‌ను తొలగించగా.. ఇప్పుడు రెండో దశ శస్త్ర చికిత్సకు సిద్ధమవుతున్నట్లు వైద్యులు వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments