Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్ల డొల్లతనం.. బొప్పాయి పండుకు పాజిటివ్

Webdunia
మంగళవారం, 5 మే 2020 (12:03 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరనా వైరస్ ఎవరికి సోకింది.. ఎవరికి సోకలేదు అని నిర్ధారించేందుకు పలు దేశాలు తమకు అందుబాటులో ఉన్న దేశాల నుంచి ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను దిగుమతి చేసుకున్నాయి. అలాంటి దేశాల్లో భారత్, టాంజానియా దేశాలు కూడా ఉన్నాయి. ఇందులో భారత్ పొరుగు దేశమైన చైనా నుంచి ఈ కిట్లను దిగుమతి చేసుకుంది. అలాగే, టాంజానియా కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంది. అయితే ఈ కిట్లలోని డొల్లతనాన్ని టాంజానియా పరిశోధనాశాల పసిగట్టింది. ఫలితంగా దిగుమతి చేసుకున్న మొత్తం కిట్ల వాడకాన్నీ నిషేధించింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కరోనా వైరస్ పరీక్షా కిట్లను టాంజానియా దిగుమతి చేసుకోగా, వీటితో గొర్రెలు, బొప్పాయి పండ్లు, మేకలపైనా పరీక్షించారు. ఓ గొర్రెలో, బొప్పాయి పండులో కరోనా వైరస్ ఉందని ఈ టెస్టింగ్ కిట్లు నిర్ధారించాయి. దీంతో నివ్వెరపోయిన శాస్త్రవేత్తలు.. ఈ కిట్లను నిశితంగా తనిఖీ చేయగా, వాటిలో సాంకేతిక లోపాలు ఉన్నట్టు గుర్తించారు. 
 
ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా, మొత్తం కిట్ల వాడకాన్ని తక్షణం నిలిపివేయాలని దేశ అధ్యక్షుడు జాన్ మగుపులి ఆదేశాలు జారీచేశారు. ఈ కిట్లతో పరీక్షలు చేస్తే, కొంతమంది కరోనా బాధితుల్లో వైరస్ లేదని వచ్చిందని అన్నారు. తదుపరి దర్యాఫ్తునకు ఆయన ఆదేశించారు. కాగా, టాంజానియాలో ఇప్పటివరకూ 480 కేసులు మాత్రమే నమోదయ్యాయి. 17 మంది మరణించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments