తెలంగాణలో కరోనా మహమ్మారి-నల్లగొండలో మూడు కేసులు

Webdunia
శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (21:38 IST)
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా నల్లగొండ జిల్లాలో మరో మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌ఓ కొండల్‌రావు విలేకరులకు తెలిపారు. వీరిలో ఇద్దరు బర్మాదేశీయులు కాగా, దామరచర్ల మండలకేంద్రానికి చెందిన మహిళ ఉన్నారని ఆయన ప్రకటించారు. 15మంది బర్మా దేశస్తులు, మరో ఇద్దరు కాశ్మీర్‌ యువకులు మతప్రచారం కోసం మార్చి 15న హైదరాబాద్‌ నుంచి నల్లగొండకు చేరుకున్నారు.

ప్రార్థనా మందిరాల్లో విడిది చేయడంతో వీరికి కరోనా సోకిందని తెలిసింది. వీరిని గుర్తించిన పోలీసులు, వైద్యాధికారులు అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు. ఫీవర్‌ ఆస్పత్రిలో పరీక్షలు చేయించగా బర్మా దేశస్తుల్లో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చినట్లు జిల్లా యంత్రాంగం శుక్రవారం ప్రకటించింది. ఇక దామరచర్ల మండల కేంద్రానికి చెందిన దంపతులు ఢిల్లీలో ప్రార్థనల్లో పాల్గొని ఇంటికి చేరుకున్నారు. అధికారులు క్వారంటైన్‌కు తరలించి పరీక్షలు జరిపించగా మహిళకు కరోనా పాజిటివ్‌ తేలింది.

తబ్లీగి జమాత్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారితోపాటు, వారితో సన్నిహితంగా మెలిగిన వారితో తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య అమాంతం పెరిగింది. ఇప్పటి వరకు పదుల సంఖ్యలో ఉన్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య , ఒక్కసారిగా పెరుగుతుండడం రాష్ట్ర ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. శుక్రవారం ఒక్కరోజే 75 కేసులు నమోదయినట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించాడు. ఇందులో ఇద్దరు మృతి చెందినట్లు తెలిపారు .

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పూర్వీకులు భయంకరమైన ఘోరాలకు పాల్పడ్డారు: విజయేంద్ర ప్రసాద్ షాకింగ్ వ్యాఖ్యలు

'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్ (వీడియో)

Vishwak Sen : విశ్వక్‌సేన్ # CULT పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ టీజర్

Yash: రక్తం పారుతుంటే మందు తాగుతూ టాక్సిక్ ద్వారా యశ్ ఏం చెబుతున్నాడు?

Dasharath: టీవీ, ఓటీటీ కంటెంట్ దర్శకుడు ఆర్య హీరోగా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మంచి కోడిగుడ్లు, మంచి పాలు వెతుక్కోవాల్సి వస్తోంది, ఎందుకంటే?

బైపాస్ సర్జరీ శాశ్వత పరిష్కారం కాదు, కొత్త బ్లాకేజీలపై అప్రమత్తత అవసరం

మెరుగైన శ్వాసకోశ ఆరోగ్యం కోసం పిపెయిర్‌ను విడుదల చేసిన జైడస్

గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసుకుని తాగితే?

హైబీపీ వున్నవారు ఈ పదార్థాలు తింటే...?

తర్వాతి కథనం
Show comments