కోవిడ్ టెస్టు కోసం వచ్చి కుప్పకూలిపోయాడు.. చివరికి ప్రాణాలు కోల్పోయాడు..

Webdunia
గురువారం, 30 జులై 2020 (13:51 IST)
తిరుపతిలో దారుణం చోటుచేసుకుంది. కోవిడ్ టెస్టు కోసం వచ్చిన ఓ యువకుడు కోవిడ్ టెస్ట్ బస్సు సంజీవిని వద్ద కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే 108కు ఫోన్ చేయగా గంట తర్వాత రావడంతో రుయా ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. 
 
అయితే ఎమర్జెన్సీ వార్డుకు వచ్చే లోపు మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. అయితే బిడ్డ చనిపోయిన విషయం తెలియక, శవానికి ఒళ్లు పిసికి, బిడ్డ ఒళ్లు నొప్పి తగ్గించే యత్నం చేస్తూ ఆ తండ్రి...అందరినీ కంటతడి పెట్టించాడు. 
 
వివరాల్లో వెళితే.. తిరుపతి సప్తగిరి నగర్‌కు చెందిన శేఖర్(32) గత మూడు రోజులుగా ఒళ్లు నొప్పిలు, జ్వరంతో బాధపడుతున్నాడు. మూడు రోజులుగా రుయా ఎమర్జెన్సీకి వెళితే అక్కడి సిబ్బంది పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
 
టెస్టు ఎక్కడ చేస్తారో కూడా తమకు చెప్పేవారు కరవయ్యారని శేఖర్ తండ్రి వాపోయాడు. ఈ క్రమంలో గంటల పాటు వేచి వుండి నీరసంతో కూలిపోయాడని.. చివరికి శాశ్వతంగా కూలిపోయాడని ఆ తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పూర్వీకులు భయంకరమైన ఘోరాలకు పాల్పడ్డారు: విజయేంద్ర ప్రసాద్ షాకింగ్ వ్యాఖ్యలు

'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్ (వీడియో)

Vishwak Sen : విశ్వక్‌సేన్ # CULT పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ టీజర్

Yash: రక్తం పారుతుంటే మందు తాగుతూ టాక్సిక్ ద్వారా యశ్ ఏం చెబుతున్నాడు?

Dasharath: టీవీ, ఓటీటీ కంటెంట్ దర్శకుడు ఆర్య హీరోగా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మంచి కోడిగుడ్లు, మంచి పాలు వెతుక్కోవాల్సి వస్తోంది, ఎందుకంటే?

బైపాస్ సర్జరీ శాశ్వత పరిష్కారం కాదు, కొత్త బ్లాకేజీలపై అప్రమత్తత అవసరం

మెరుగైన శ్వాసకోశ ఆరోగ్యం కోసం పిపెయిర్‌ను విడుదల చేసిన జైడస్

గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసుకుని తాగితే?

హైబీపీ వున్నవారు ఈ పదార్థాలు తింటే...?

తర్వాతి కథనం
Show comments