దేశంలో కొత్తగా 16135 కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
సోమవారం, 4 జులై 2022 (11:02 IST)
దేశంలో కొత్తగా మరో 16 వేల కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 3.32 లక్షల మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా ఇందులో 16135 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. ఆదివారం కూడా ఇదే స్థాయిలో కొత్త కేసులు నమోదైన విషయం తెల్సిందే. 
 
ఈ కొత్త కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, పశ్చిమ్ బెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో వైరస్ ఉద్ధృతి కనిపిస్తోంది. పాజిటివిటీ రేటు 4.85 శాతానికి చేరింది. ఇప్పటివరకూ 4.35 కోట్ల మందికి పైగా కరోనా బారినపడ్డారని సోమవారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 
 
కొత్త కేసులతో కలుపుకుంటే ప్రస్తుతం మొత్తం క్రియాశీల కేసులు 1,13,864కి చేరాయి. క్రియాశీల రేటు 0.26 శాతానికి పెరగ్గా.. రికవరీ రేటు 98.53 శాతానికి పడిపోయింది. ఆదివారం 13,958 మంది కోలుకున్నారు. 24 గంటల వ్యవధిలో 24 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తంగా 5.25 లక్షల మందికిపైగా మరణించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalki 2 shoot: కల్కి 2 తాజా అప్ డేట్ - ప్రభాస్, అమితాబ్ బచ్చన్ పై సన్నివేశాల చిత్రీకరణ

Varalakshmi: వరలక్ష్మి ని చూసి బాలయ్య గారు ఊర్వశి శారద తో పోల్చారు : గోపీచంద్ మలినేని

బ్యాండ్ మేళం నుంచి ఎనర్జిటిక్ సాంగ్ తిప్పుకుంటన్నవ్ రిలీజ్

Trigun: త్రిగుణ్ హీరోగా లక్కీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఆకర్షిత చిత్రం ప్రారంభం

Anil Ravipudi : రీల్ లైఫ్ లో రియల్ లైఫ్ జంట కిల్లర్ లో ఆసక్తికరంగా ఉంది : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

కాలేయానికి మేలు చేసే పసుపు కలిపిన ఉసిరి రసం, ఇంకా ఏమేమి ప్రయోజనాలు?

మంచి కోడిగుడ్లు, మంచి పాలు వెతుక్కోవాల్సి వస్తోంది, ఎందుకంటే?

బైపాస్ సర్జరీ శాశ్వత పరిష్కారం కాదు, కొత్త బ్లాకేజీలపై అప్రమత్తత అవసరం

మెరుగైన శ్వాసకోశ ఆరోగ్యం కోసం పిపెయిర్‌ను విడుదల చేసిన జైడస్

తర్వాతి కథనం
Show comments