దేశంలో మళ్లీ పెరిగిన కోవిడ్ పాజిటివ్ కేసులు

Webdunia
శుక్రవారం, 8 జులై 2022 (11:17 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఒక్కసారిగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో మొత్తం 3.79 లక్షల మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా అందులో 18815 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. దీంతో కరోనా వైరస్ వ్యాప్తి పాజిటివిటీ రేటు ఏకంగా 4.96 శాతానికి పెరిగింది. 
 
అలాగే, కేసుల సంఖ్య కూడా పెరిగింది. ఈ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటకతో సహా పలు రాష్ట్రాల్లో వైరస్ విజృంభణ కనిపిస్తోంది. ఇప్పటివరకూ 4.35 కోట్ల మందికి కరోనా సోకిందని శుక్రవారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 
 
ప్రస్తుతవ్యాప్తి కారణంగా క్రియాశీల కేసులు 1,22,335కి చేరాయి. మొత్తం కేసుల్లో వాటి వాటా 0.27 శాతానికి చేరగా.. రికవరీ రేటు 98.52 శాతానికి పడిపోయింది. 24 గంటల వ్యవధిలో 15,899 మంది కోలుకోగా.. 38 మంది మరణించినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

DSP: ఉస్తాద్ భగత్ సింగ్ సెకండ్ సింగిల్ ప్రోమో - పవన్ కు గిఫ్ట్ ఇది : దేవీశ్రీ ప్రసాద్

DiL Raju: నిర్మాత అంటే విలువలేదు - కానీ సినిమా తీస్తా : దిల్ రాజు

తండ్రి కూతురు సెంటిమెంట్ తో డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు ట్రైలర్

Sri Vishnu: విష్ణు విన్యాసం స్ట్రెస్ బస్టర్ లాగా ఉంటుంది : శ్రీ విష్ణు

Anupama: అనుపమ పరమేశ్వరన్ తో అగ్ర నిర్మాణ సంస్థ కొత్త మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెరుగైన శ్వాసకోశ ఆరోగ్యం కోసం పిపెయిర్‌ను విడుదల చేసిన జైడస్

గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసుకుని తాగితే?

హైబీపీ వున్నవారు ఈ పదార్థాలు తింటే...?

అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?

హైదరాబాద్‌లో టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను నిర్వహించిన టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్

తర్వాతి కథనం
Show comments