దేశంలో కొత్తగా మరో 36 వేల పాజిటివ్ కేసులు

Webdunia
గురువారం, 19 ఆగస్టు 2021 (10:52 IST)
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 36,401 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే, 39,157 మంది బాధితులు కోలుకున్నారు. 24 గంటల్లో 530 మంది బాధితులు మహమ్మారి బారినపడి మృత్యువాతపడ్డారు. 
 
తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,23,22,258కు పెరిగింది. ఇందులో 3,15,25,800 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 3,64,129 ఉన్నాయని చెప్పింది. వైరస్‌ బారినపడి ఇప్పటివరకు 4,33,049 మంది కన్నుమూశారు.
 
మరోవైపు దేశంలో కొవిడ్‌ పరీక్షలు 50కోట్ల మార్క్‌ను దాటాయి. బుధవారం దేశవ్యాప్తంగా 18,73,757 కొవిడ్‌ శాంపిల్స్‌ పరీక్షించగా.. ఇప్పటివరకు 50,03,00,840 నమూనాలను పరిశీలించినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) వివరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దాదా- ది సౌర‌వ్ గంగూలీ స్టోరీ మూవీ ఫ‌స్ట్ లుక్, 2027న సినిమా విడుద‌ల‌

Rashmika: మైసా కోసం రష్మిక రిస్కీ స్టంట్స్.. అండర్‌వాటర్ ఫైట్ సీక్వెన్స్ పూర్తి

Sagar: వంద మందిని పరిచయం చేస్తూ కొత్త సినిమా..మేము కూడా సినిమా తీసినామురో

Naresh Vijaya Krishna: తమిళనాడు ఆదర్శంగా ఆంధ్ర లో కొత్త రాజకీయ శక్తి : నరేష్ విజయ కృష్ణ

M.S. Raju: మిస్టిక్ డివైన్ థ్రిల్లర్ గా అగధ వుంటుంది : ఎం.ఎస్. రాజు

తర్వాతి కథనం
Show comments