Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటన్‌లో కరోనా విజృంభణ.. ఒక్కరోజే 5.28లక్షల కేసులు.. లక్షమంది మృతి

Webdunia
బుధవారం, 27 జనవరి 2021 (13:49 IST)
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే వున్నాయి. మంగళవారం ఒక్కరోజే 5.28లక్షల వైరస్ కేసులు వెలుగుచూశాయి. ఫలితంగా బాధితుల సంఖ్య 10.08కోట్లకు ఎగబాకింది. మహమ్మారి ధాటికి మరో 15వేల మందికిపైగా బలయ్యారు. మరణాల సంఖ్య 21.65 లక్షలకు చేరింది. ఇక బ్రిటన్లో మరణాల సంఖ్య లక్ష దాటింది.
 
బ్రిటన్ కన్నా ముందు.. అమెరికా(4.35లక్షలు), బ్రెజిల్(2.18లక్షలు), భారత్(1.53లక్షలు), మెక్సికో(1.5లక్షలు)లలో మాత్రమే లక్షకుపైగా మరణాలు నమోదయ్యాయి. బ్రిటన్‌లో వైరస్ వ్యాప్తి మెుదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ 1లక్షా 162మంది చనిపోయినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. పలు దేశాల్లో వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టినా.. బ్రిటన్‌లో రోజువారీ కేసుల్లో అది కనిపించటం లేదు.
 
దేశంలో కరోనా మృతుల సంఖ్య లక్ష దాటడంపై ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ విచారం వ్యక్తం చేశారు. ఇది ఎంతో భయంకరమైన పరిస్థితి అన్న ఆయన.. వైరస్‌ను ఓడించేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు చెప్పారు. 
 
కొవిడ్ మృతులను దేశం స్మరించుకుంటుందని, విపత్కర పరిస్థితులను తొలగించేందుకు జాతీయ స్థాయిలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆ దేశంలో ఇప్పటివరకూ 36లక్షల 89వేల మంది కరోనా బారినపడ్డారు. వారిలో 16లక్షల 62 వేల మంది కరోనాను జయించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments