Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుభవార్త చెప్పిన కేంద్రం : కరోనా వైరస్ క్రమంగా తగ్గుముఖం

Webdunia
బుధవారం, 12 మే 2021 (11:39 IST)
కేంద్రం శుభవార్త చెప్పింది. కరోనా భయంతో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు కేంద్రం చెప్పిన వార్త నిజంగానే సంతోషం కలిగించే వార్తే. దేశంలో కరోనా వైరస్ క్రమంగా తగ్గిపోతుందని తెలిపింది. ముఖ్యంగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ సహా 18 రాష్ట్రాల్లో కొత్త కేసులు తగ్గుముఖం పట్టాయని తెలిపింది. 
 
26 రాష్ట్రాల్లో కొవిడ్ పాజిటివిటీ రేటు సుమారు 15 శాతంగా ఉందని వెల్లడించింది. కరోనా తీవ్రత మేరకు దేశంలో కంటైన్మెంట్ చర్యలు ఉంటాయని ఆరోగ్యశాఖ పేర్కొంది.
 
అయితే, ఈ వైరస్ ప్రభావం మే చివరినాటికి బలహీన పడుతుందని అంచనా వేస్తుండగా, మూడో వేవ్ వస్తే అది చిన్నారులపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. 
 
కరోనా తొలి వేవ్‌లో చిన్నారులపై కరోనా ప్రభావం 1 శాతం కంటే తక్కువ కాగా, సెకండ్ వేవ్‌లో పిల్లలకు కరోనా సోకే రేటు 10 శాతానికి పెరిగింది. అది థర్డ్ వేవ్ నాటికి 80 శాతానికి పెరుగుతుందన్న అంచనాలను నిపుణులు వెల్లడిస్తున్నారు. 
 
జన్యు ఉత్పరివర్తనాలు చెందే కొద్దీ కరోనా వైరస్ మరింత శక్తిమంతంగా తయారవుతుండడమే అందుకు కారణమని భావిస్తున్నారు. అదేసమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అధికంగా పెరుగుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments