మానవాళికి పెనుముప్పుగా కరోనా... 204 దేశాలకు వ్యాప్తి.. 50 వేల మంది మృతి

Webdunia
శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (16:51 IST)
మానవాళికి కరోనా వైరస్ పెనుముప్పుగా మారింది. ఈ వైరస్ దేశాల సరిహద్దులను యధేచ్చగా దాటిపోతోంది. ఫలితంగా ఇప్పటివరకు ఏకంగా 204 దేశాలకు వ్యాపించింది. పైగా, ఈ వైరస్ బారినపడి చనిపోతున్న వారి సంఖ్య కూడా రోజురోజుకూ పెరిగిపోతోంది. శుక్రవారానికి ఈ సంఖ్య 52982కు చేరింది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 1014256గా ఉన్నాయి. 
 
ముఖ్యంగా ఇటలీలో కరోనా మృత్యుఘంటికలు మోగిస్తోంది. అక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య 1,15,242 కాగా, మృతుల సంఖ్య 13,915కి పెరిగింది. స్పెయిన్ లోనూ ఇదే తరహా భయానక పరిస్థితి నెలకొంది. పాజిటివ్ కేసుల సంఖ్య 1,12,065 కాగా, మృతిచెందిన వారి సంఖ్య 10,348.
 
ఇక పాజిటివ్ కేసుల విషయానికొస్తే అగ్రరాజ్యం అమెరికా ప్రథమస్థానంలో ఉంది. ఇప్పుడక్కడ 2,44,230 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 5,886 మంది మృత్యువాత పడ్డారు. ఫ్రాన్స్‌లోనూ కరోనా బీభత్సం కొనసాగుతోంది. 59,105 పాజిటివ్ కేసులు నమోదవగా, 5,387 మంది మరణించారు. 
 
భారతదేశంలోనూ కరోనా విజృంభిస్తోంది. భారత్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య 2,567కి పెరిగింది. దేశంలో ఇప్పటివరకు కరోనాతో 72 మంది మృతి చెందారు. గుజరాత్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

promo of Aara of Ustad: ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఆరా ఆఫ్ ఉస్తాద్ ప్రోమో వచ్చేసింది

Hey Balwant review: హే భగవాన్ పేరు మారిన హే బలవంత్ మూవీ రివ్యూ

రష్మిక-విజయ్ వివాహం.. బందోబస్తు కోసం అంతర్జాతీయ భద్రతా సంస్థ

మా పూర్వీకులు భయంకరమైన ఘోరాలకు పాల్పడ్డారు: విజయేంద్ర ప్రసాద్ షాకింగ్ వ్యాఖ్యలు

'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్ (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మంచి కోడిగుడ్లు, మంచి పాలు వెతుక్కోవాల్సి వస్తోంది, ఎందుకంటే?

బైపాస్ సర్జరీ శాశ్వత పరిష్కారం కాదు, కొత్త బ్లాకేజీలపై అప్రమత్తత అవసరం

మెరుగైన శ్వాసకోశ ఆరోగ్యం కోసం పిపెయిర్‌ను విడుదల చేసిన జైడస్

గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసుకుని తాగితే?

హైబీపీ వున్నవారు ఈ పదార్థాలు తింటే...?

తర్వాతి కథనం
Show comments