మొహాలీ టీ20 : ఆప్ఘాన్‌పై ఆరు వికెట్ల తేడాతో భారత్ విజయం

ఠాగూర్
శుక్రవారం, 12 జనవరి 2024 (08:13 IST)
భారత్‌లో ఆప్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా, గురువారం రాత్రి మొహాలీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో పర్యాటక జట్టుపై విజయభేరీ మోగించింది. భారత క్రికెటర్ శివమ్ దూబే రెచ్చిపోయాడు. 40 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్స్‌ల సాయంతో 60 పగుగులు చేసాడు. దీంతో ఆప్ఘనిస్థాన్ నిర్దేశించిన 159 పరుగుల విజయలక్ష్యాన్ని 17.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. 
 
భారత జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ డౌకౌట్ కాగా, శుభ్‌మాన్ గిల్ 23, తిలక్ వర్మ 26, జితేశ్ శర్మ 31 చొప్పున రాణించారు. మ్యాచ్ ఆఖరులో హార్డ్ హిట్టర్ రింకూసింగ్ 9 బంతుల్లో 16 పరుగులు చేశాడు. రింకూ సింగ్, శివమ్ దూబేలు అజేయంగా నిలిచి మ్యాచ్‌ను గెలిపించారు. ఆప్ఘన్ బౌలర్లలో ముజబీ ఉర్ రెహ్మాన్ 2, అజ్మతుల్లా ఒమర్జాయ్ ఒక వికెట్ చొప్పున తీశాడు. 
 
ఈ మ్యాచ్ తర్వాత రింకూ సింగ్ స్పందిస్తూ, మొహాలీ మ్యాచ్ ఆడడాన్ని ఆస్వాదించానని చెప్పాడు. కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ అధికమించినట్టు చెప్పాడు. మొదటి రెండు మూడు బంతులు కొంత ఒత్తిడిగా అనిపించిందని, ఆ తర్వాత నేను బంతిపై దృష్టిపెట్టి ఆడానని రింకూ చెప్పాడు. పెద్ద సిక్సర్లు కొట్టగలననే నమ్మకం తనకు ఉందన్నాడు. ఆ అవకాశం రావడంతో బౌలింగ్ చేశానని చెప్పాడు. పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్‌‍లో ఈ విషయాలను పంచుకున్నట్టు చెప్పాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Watching TV: పదివేల రూపాయలు ఇవ్వలేదని.. తల్లిని హత్య చేసిన కుమారుడు.. ఎక్కడ?

మా జోలికి వస్తే యుద్ధ విమానాల కిందే సమాధి చేస్తాం ... భారత్‌కు పాక్ హెచ్చరిక

టమోటాలను రోడ్డున పారేస్తున్న రైతులు.. నిరసన- ట్రాఫిక్ జామ్

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఓటు వేసేందుకు ముస్లిం మహిళలు బురాఖా తీయాల్సిందే.. బీజేపీ

Amaravati: అమరావతిలో సీఆర్డీఏ ప్రధాన కార్యాలయం.. అక్టోబర్ 13న ప్రారంభం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: రవితేజ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ ప్రోమో

'థామా' నుంచి నువ్వు నా సొంతమా పాట రిలీజ్

Geethamadhuri : కానిస్టేబుల్ లో గీతామాధురి పాడిన ధావత్ సాంగ్ కు ఆదరణ

Dil Raju: తేజసజ్జా తో దిల్ రాజు చిత్రం - ఇంటికి పిలిచి ఆత్మీయ వేడుక జరిపాడు

Anupam Kher: కాంతార ఛాప్టర్ 1 చూశాక మాటలు రావడంలేదు : అనుపమ్ ఖేర్

తర్వాతి కథనం
Show comments