Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరంగేట్రంలోనే అర్థసెంచరీ.. మయాంక్ అదుర్స్.. నిరాశపరిచిన హనుమ విహారి

Webdunia
బుధవారం, 26 డిశెంబరు 2018 (13:00 IST)
ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్‌లో జరుగుతున్న తొలి టెస్ట్‌‌లో భారత్ ఇన్నింగ్స్‌ నిలకడగా ఆడుతోంది. ముఖ్యంగా ఈ మ్యాచ్ ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేసిన మయాంక్ అగర్వాల్ అర్థసెంచరీ చేశాడు. 95 బంతుల్లో మయాంక్ అర్థ సెంచరీని సాధించాడు. తద్వారా అరంగేట్రంలోనే అర్థశకతం సాధించిన ఏడవ భారత ఓపెనర్‌గా గుర్తింపును సంపాదించుకున్నాడు. 
 
మయాంక్‌ కన్నా ముందు శిఖర్ ధావన్, పృథ్వీషా, గవాస్కర్, ఇబ్రహీం, అరుణ్, హుస్సేన్‌లు ఈ రికార్డును సాధించారు. తొలి టెస్టులోనే అద్భుతంగా రాణించి సెలక్టర్లు తనపై ఉంచిన నమ్మకాన్ని మాయంక్ నిలబెట్టుకున్నాడు. అయితే శతకాన్ని మాత్రం సాధించలేకపోయాడు. సెంచరీ దిశగా దూసుకెళ్తున్న మయాంక్ 76 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కమ్మిన్స్ బౌలింగ్‌‌లో పెవిలియన్‌కు చేరాడు. 
 
మరోవైపు మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాతో ప్రారంభమైన మూడో టెస్టులో ఓపెనర్‌గా లభించిన అవకాశాన్ని తెలుగు కుర్రాడు హనుమ విహారి సద్వినియోగం చేసుకోలేకపోయాడు.  టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్, ఓపెనర్ జోడీని మారుస్తూ, విహారి, మయాంక్ అగర్వాల్‌ను తొలుత బ్యాటింగ్‌కు పంపింది. కానీ ఎనిమిది పరుగుల వద్ద కుమిన్స్ బౌలింగ్‌లో పించ్‌కు క్యాచ్ ఇచ్చిన హనుమ విహారి.. పెవిలియన్‌కు చేరాడు. 
 
ఇదే సమయంలో ఆచితూచి ఆడుతున్న మయాంక్, వన్ డౌన్ బ్యాట్స్ మెన్ ఛటేశ్వర్ పుజారాతో కలసి స్కోరును 50 పరుగులు దాటించాడు. దీంతో మూడో టెస్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 215 పరుగులు సాధించింది. మయాంక్ 76 పరుగుల వద్ద అవుట్ కాగా, హనుమ  విహారి 8 పరుగులకే వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజ్ లో కోహ్లీ (47), చటేశ్వర్ పుజారా (68) ఉన్నారు. మరో వైపు ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్ ఒక్కడే రెండు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu Naidu: అల్పాహారంలో ఆమ్లెట్ తప్పకుండా తీసుకుంటాను.. చంద్రబాబు

పురుషులపై అయిష్టత - పైగా నమ్మకం లేదంటూ పెళ్లి చేసుకున్న ఇద్దరు యువతులు

Masood Azhar: మసూద్ అజార్‌కు రూ.14కోట్ల పరిహారం ఇస్తోన్న పాకిస్థాన్.. ఎందుకంటే?

మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కనుసన్నల్లోనే పహల్గాం ఉగ్రదాడి : పంజాబ్ మంత్రి!!

Bihar: భర్తతో గొడవ.. నలుగురు పిల్లలతో కలిసి విషం తాగింది.. ఆ తర్వాత ఏమైందంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా మేగజైన్ కవర్ పేజీపై విజయ్ దేవరకొండ

తెలుగు సినిమాటోగ్రాఫ‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా పి.జి.విందా

AP GO : సినిమా ప్రవేశ రేట్లను అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు

రెడ్ కార్పెట్‌పై హొయలొలకించిన ఊర్వశి రౌతేలా... ఐశ్వర్యను కాపీ కొట్టారా?

కాంతారా 1: వారాహి పంజుర్లి ఆదేశాలను పాటిస్తున్న రిషబ్ శెట్టి.. కారణం అదే? (video)

తర్వాతి కథనం
Show comments