Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద్వేషం కలిగేలా ట్రోల్స్ చేస్తున్నారు ... మౌనం అర్థాంగికారం కాదు : చాహల్ సతీమణి ధర్మశ్రీ

ఠాగూర్
గురువారం, 9 జనవరి 2025 (15:04 IST)
భారత క్రికెటర్ యజువేంద్ర చాహల్ - ధనశ్రీ వర్మ దంపతులు విడిపోబోతున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం సాగుతుంది. దీనిపై ధనశ్రీ వర్మ తాజాగా ఓ ట్వీట్ చేయగా, అది వైరల్‌గా మారింది. కొన్ని రోజులుగా మీడియాలో వస్తోన్న వార్తల వల్ల తాను మానసిక వేదనకు గురవుతున్నట్లు ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.
 
'కొన్ని రోజులుగా నేను, నా కుటుంబం కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. నిజానిజాలు తెలుసుకోకుండా అవాస్తవాలు రాస్తున్నారు. నాపై ద్వేషం కలిగేలా ట్రోల్స్ చేస్తున్నారు. ఈ విషయం నన్ను నిజంగా బాధిస్తోంది. నేను ఈ స్థాయికి రావడానికి ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్నాను. నేను మౌనంగా ఉంటున్నానంటే దాని అర్ధం బలహీనంగా ఉన్నట్లు కాదు.
 
సోషల్ మీడియాలో ప్రతికూలత ఉన్నప్పటికీ ఇతరులపై కరుణ చూపాలంటే ధైర్యం అవసరం. నేను వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని విలువలతో ముందుకుసాగాలనుకుంటున్నా. నిజం ఎప్పటికైనా విజయం సాధిస్తుంది. దాన్ని సమర్థించుకోవాల్సిన అవసరం లేదు' అని ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ధనశ్రీ పోస్ట్ వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మాజీ కాశ్మీరీ ఉగ్రవాదులను పెళ్లి చేసుకున్న పాక్ మహిళల్ని ఏం చేశారు?

నేను పోతే ఉప ఎన్నిక వస్తాది... ఆ సీటులో ఎమ్మెల్యే అయిపోవాలని ఆశపడుతున్నారు..

ఆ పాట పెళ్లిని ఆపేసింది.. మాజీ ప్రియురాలు గుర్తుకొచ్చి.. పెళ్లి వద్దనుకున్న వరుడు?

Washington: ఆ కుటుంబానికి ఏమైంది..? టెక్కీ కింగ్ అయినా భార్యను, కుమారుడి కాల్చేశాడు.. తర్వాత?

ఏపీలో వైకాపా లిక్కర్ స్కామ్-రూ.3,200 కోట్ల భారీ మోసం.. సిట్ వెల్లడి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్

జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

రజనీకాంత్ 'జైలర్-2'లో 'లెజెండ్' బాలకృష్ణ? - నెట్టింట వైరల్!

HIT 3 పహల్గమ్ షూట్ లో ఒకరు చనిపోవడం బాధాకరం: నాని

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రానికి భోగి టైటిల్ ఖరారు

తర్వాతి కథనం
Show comments