Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంగ్లాండ్‌కు గట్టి షాక్.. గాయంతో మార్క్ వుడ్ దూరం..

Webdunia
సోమవారం, 23 ఆగస్టు 2021 (19:05 IST)
భారత్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్ ఓడిన ఇంగ్లాండ్.. మూడో టెస్టులో విజయం సాధించి సిరీస్‌ను సమయం చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే ఆ జట్టుకు షాక్ తగిలింది. భుజం గాయంతో ఆ జట్టు స్టార్‌ పేసర్ మార్క్ వుడ్ హెడింగ్లీ మూడో టెస్ట్‌కు దూరమయ్యాడు. 
 
రెండో టెస్టు నాలుగో రోజు ఆటలోనే గాయపడిన అతను పూర్తి ఫిట్‌నెస్ సాధించలేకపోవడంతోమూడో టెస్ట్‌కు దూరంగా ఉంటాడని ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. అయితే 31 ఏండ్ల మార్క్‌ వుడ్‌ జట్టుతోనే ఉంటాడని, వైద్యుల పర్యవేక్షణలో కోలుకోవడంపై దృష్టిసారిస్తాడని తెలిపింది.
 
మూడో టెస్ట్ అనంతరం అతనికి మరోసారి ఫిట్‌నెస్‌ పరీక్ష నిర్వహిస్తామని అప్పటికీ కోలుకోలేకపోతే సిరీస్‌ నుంచి తప్పిస్తామని ఈసీబీ పేర్కొంది. భారత్ ఇంగ్లాండ్ ల మధ్య బుధవారం నుంచి మూడో టెస్ట్‌ ప్రారంభం కానుంది. 
 
ఇప్పటికే గాయాలతో బ్రాడ్, వోక్స్, అర్చర్ సేవలను కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టుకు ఇది పెద్ద షాకే. అయితే గాయం కారణంగా దూరమైన వుడ్ స్తానంలో సకిబ్ మహ్మద్ టెస్టుల్లో అరంగ్రేటం చేసే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాబోయే భర్త ఎలా ఉండాలంటే.. ఓ యువతి కోరికల చిట్టా .. సోషల్ మీడియాలో వైరల్

నా స్నేహితుడు చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు : ప్రధాని మోడీ ట్వీట్

కొనసాగుతున్న ఉపరితల ద్రోణి - ఏపీకి వర్ష సూచన

ఫేషియల్ చేయించుకుందని భార్య జట్టు కత్తిరించిన భర్త (Video)

చెన్నైలో షాక్ : కరెంట్ తీగ తగిలి ప్రాణాలతో కొట్టుమిట్టిన బాలుడు...(Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

తర్వాతి కథనం
Show comments