Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ మ్యాచ్ : లక్నో ఓటమి.. గుజరాత్ విజయం

Webdunia
మంగళవారం, 29 మార్చి 2022 (09:36 IST)
ఐపీఎల్ 15వ సీజన్ టోర్నీలో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు విజయభేరీ మోగించింది. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి లక్నో సూపర్ జెయింట్స్‌ను ఐదు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఐపీఎల్ తొలిసారి ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ రెండు జట్లూ కొత్తవి కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు ఆరంభంలో కాస్త తడబడింది. ఆ తర్వాత నిలదొక్కుకుని రాణించింది. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 158 పరుగులు చేసింది. 
 
లక్నో జట్టులో కెప్టెన్ రాహుల్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. అప్పటి నుంచి వికెట్లు వరుసగా కుప్పకూలాయి. ప్రత్యర్థి జట్టు బౌలరు షమీ నిప్పులు చెరిగే బంతులతో లక్నో జట్టు బ్యాటింగ్‌కు తీవ్రంగా దెబ్బతీశాడు. దీంతో ఇన్నింగ్స్ తొలి బంతికే రాహుల్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత డికాక్ 7, లుయాస్ 10, మనీష్ పాండే 6 చొప్పున మాత్రమే పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దీంతో లక్నో జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకునిపోయింది. అయితే, దీపక్ హుడా, ఆయూష్ బదోనీ ఇద్దరూ క్రీజ్‌లో నిలబడి జట్టును నిలబెట్టే ప్రయత్నం చేశారు. 
 
ఓ వైపు బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూనే మరోవైపు, పరుగులు రాబట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇద్దరూ అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. దీపక్ 41 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్సర్లతో 55 పరుగులు చేయగా, ఆయుష్ బదోని 41 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 54 పరుగులు చేశాడు. 
 
చివర్లో కృనాల్ పాండ్యా 13 బంతుల్లో 3 ఫోర్లతో 21 పరుగులు చేయడంతో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగుల గౌరవ ప్రదమైన స్కోరు చేయగలిగింది. గుజరాత్ బౌలర్లలో షమీ 3 వికెట్లు పడగొట్టగా, అరోన్ 2, రషీద్ ఖాన్‌కు ఓ వికెట్ దక్కింది. షమీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
 
ఆ తర్వాత 159 పరగులు విజయలక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టు మరో రెండు బంతులు మిగిలివుండగానే 5 వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. తొలి ఓవర్ మూడో బంతికి గిల్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత 15 పరుగుల వద్ద విజయ్ శంకర్ ఔటైనప్పటికీ మాథ్యువేడ్ 30, హార్థిక్ పాండ్య 33, మిల్లర్ 30 రాణించడంతో పాటు మ్యాచ్ ఆఖర్లో రాహుల్ తెవాటియా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 
 
దీంతో 24 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 40 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అభినవ్ మనోహర్ 7 బంతుల్లో 3 ఫోర్లతో 15 పరుగులు చేయడంతో మరో రెండు బంతులు మిగిలి ఉండగానే విజయం గుజరాత్ ఖాతాలో చేరింది. లక్నో బౌలర్లలో దుష్మంత చమీర 2 వికెట్లు పడగొట్టగా, అవేశ్ ఖాన్, కృనాల్ పాండ్యా, దీపక్ హుడా చెరో వికెట్ తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉగ్రవాదులు - అండగా నిలిచేవారు మూల్యం చెల్లించుకోక తప్పదు : ప్రధాని మోడీ వార్నింగ్

Kanpur: యువజంట నూడుల్స్ తింటుంటే దాడి చేశారు.. వీడియో వైరల్

నీకెన్నిసార్లు చెప్పాలి... నన్ను కలవడానికి ఢిల్లీకి రావాలని? లోకేశ్‌కు ప్రధాని ప్రశ్న!

Hyderabad: నెలవారీ బస్ పాస్ హోల్డర్ల కోసం మెట్రో కాంబో టికెన్

పాకిస్థాన్‌కు మరో షాకిచ్చిన కేంద్రం... దిగుమతులపై నిషేధం!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ సినిమాటోగ్రఫర్‌గా కుశేందర్ రమేష్ రెడ్డి‌

Deverakonda: నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు : విజయ్ దేవరకొండ

'రెట్రో' ఆడియో రిలీజ్ వేడుకలో నోరు జారిన విజయ్ దేవరకొండ.. వివరణ ఇస్తూ నేడు ప్రకటన

తర్వాతి కథనం
Show comments