Webdunia - Bharat's app for daily news and videos

Install App

రన్ మిషీన్ రికార్డును బద్ధలు కొట్టిన సౌతాఫ్రికా ప్లేయర్

Webdunia
ఆదివారం, 20 జనవరి 2019 (16:51 IST)
ఆధునిక క్రికెట్‌లో పరుగుల యంత్రంగా గుర్తింపు పొందిన క్రికెటర్ విరాట్ కోహ్లీ. భారత్ క్రికెట్ జట్టు కెప్టెన్. ఈ మధ్య కాలంలో క్రికెట్‌లో ఏ రికార్డు బద్దలుకొట్టాలన్నా అది కోహ్లీకే సాధ్యంగా మారింది. ఈ రన్‌మెషీన్ అంతటి సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. 
 
అలాంటి కోహ్లీ రికార్డును బద్ధలు కొట్టారు. ఆ క్రికెటర్ పేరు హషీమ్ ఆమ్లా. సౌతాఫ్రికా ఓపెనర్. పాకిస్థాన్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో సెంచరీ చేసిన ఆమ్లా.. విరాట్‌ను వెనక్కి నెట్టాడు. వన్డేల్లో వేగంగా 27 సెంచరీల మార్క్ అందుకున్న ప్లేయర్‌గా అతడు నిలిచాడు. 
 
కోహ్లి 169 ఇన్నింగ్స్‌లో ఈ మార్క్ అందుకోగా.. ఆమ్లా 167 ఇన్నింగ్స్‌లోనే 27 సెంచరీలు చేయడం విశేషం. కోహ్లి కంటే ముందు సచిన్ (254 ఇన్నింగ్స్) పేరిట ఈ రికార్డు ఉంది. 2017, జనవరిలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి ఆ రికార్డును బ్రేక్ చేశాడు. రెండేళ్ల కిందటి కోహ్లి రికార్డును ఇప్పుడు ఆమ్లా తిరగరాశాడు. అయితే ఈ రికార్డు సెంచరీ కూడా సౌతాఫ్రికాను గెలిపించలేకపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Sritej: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పుష్ప2 బాధితుడు శ్రీతేజ్

Monalisa: మోనాలిసా మేకోవర్ వీడియో వైరల్

వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు: విచారణను జూలై నెలాఖరుకు సుప్రీం వాయిదా

తెలంగాణాలో 30న టెన్త్ పరీక్షా ఫలితాలు - ఈసారి చాలా స్పెషల్ గురూ..!

Amaravati : అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించమని పార్లమెంటును కోరతాం..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

తర్వాతి కథనం
Show comments