Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీ నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతం : బీసీసీఐ చీఫ్ గంగూలీ

Webdunia
ఆదివారం, 16 జనవరి 2022 (15:37 IST)
భారత క్రికెట్ జట్టు టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయం పూర్తిగా అది అతని వ్యక్తిగతమని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డారు. 
 
ఇదే అంశంపై ఆయన ఆదివారం ఓ ట్వీట్ చేశారు. "ఇది పూర్తిగా విరాట్ వ్యక్తిగత నిర్ణయం. దాన్ని బీసీసీఐ ఎంతో గౌరవిస్తుంది. విరాట్ సారథ్యంలోని అన్ని ఫార్మెట్లలో భారత్ క్రికెట్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందింది. భవిష్యత్‌లోనూ ఈ జట్టును మరింత ఎత్తుకు తీసుకెళ్లడంలోనూ విరాట్ కోహ్లీ కీలక సభ్యుడుగా ఉంటాడు. విరాట్ అద్భుత ఆటగాడు. వెల్డన్" అంటూ గంగూలీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
కాగా, ఇటీవల వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి కోహ్లీని బీసీసీఐ తప్పించింది. అతని స్థానంలో రోహిత్ శర్మకు సారథ్య బాధ్యతలు అప్పగించింది. ఇపుడు బీసీసీఐకు - కోహ్లీకి మధ్య బహిరంగ వార్ జరిగింది. టీ20 కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకోవద్దని తాము కోరామని గంగూలీ చెప్పగా, దాన్ని కోహ్లీ ఖండించారు. అలాగే, వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించే సమయంలో కూడా గంట ముందు మాత్రమే తనకు సమాచారం ఇచ్చారని కోహ్లీ ఆరోపించిన విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కొనియాడిన మంత్రి నారా లోకేష్

మానవత్వం చాటిన మంత్రి నాదెండ్ల మనోహర్.. కాన్వాయ్ ఆపి మరీ..

మావోయిస్టులు ఆయుధాలు వదులుకోకపోతే చర్చలు జరపబోం.. బండి సంజయ్

నలుగురు పిల్లలకు తండ్రి.. ప్రియురాలికి పెళ్లి నిశ్చమైందని యాసిడ్ దాడి.. ఎక్కడ?

RK Roja: ఆర్కే రోజాపై భూ ఆక్రమణ ఫిర్యాదులు.. టీడీపీని ఆశ్రయించిన బాధితులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

తర్వాతి కథనం
Show comments