Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్: భారత్-పాకిస్థాన్‌ను తండ్రి-కొడుకుతో పోల్చిన రిషికపూర్.. ధోనీ ట్వీట్ వైరల్

బాలీవుడ్ స్టార్ రిషికపూర్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పోరుపై సంచలన ట్వీట్ చేశాడు. అందులో పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు హెచ్చరికలు జారీ చేశాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు క్రికెట్ జట్టును మాత్రమే పంపించాలి.

Webdunia
ఆదివారం, 18 జూన్ 2017 (12:03 IST)
బాలీవుడ్ స్టార్ రిషికపూర్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పోరుపై సంచలన ట్వీట్ చేశాడు. అందులో పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు హెచ్చరికలు జారీ చేశాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు క్రికెట్ జట్టును మాత్రమే పంపించాలి. హామీ టీమ్‌నో, ఖోఖో టీమ్‌నో కాదు. ఎందుకంటే? 18వ తేదీ ఫాదర్స్ డే రోజున మీతో ఆడేది అబ్బలు (ఫాదర్స్) అంటూ ట్వీట్ చేశాడు. సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై పాకిస్థాన్ నెగ్గిన తర్వాత కూడా రిషికపూర్ పాక్ జట్టును అభినందిస్తూ ట్వీట్ చేశాడు.
 
పాకిస్థాన్‌కు శుభాకాంక్షలు చెబుతూనే తమ జట్టు రంగు అయిన నీలం (బ్లూ)ను ధరించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించాడు. తాజాగా భారత్-పాకిస్థాన్‌ను "తండ్రి-కొడుకు"తో రిషికపూర్‌ పోల్చాడు. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో నేడు భారత్-పాక్‌లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పాక్, భారత్ క్రికెట్ అభిమానులకు ఒక ఫోటోతో చక్కని సందేశం పంపాడు. 
 
పాకిస్థాన్ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ ఖాన్ కుమారుడు అబ్దుల్లాను ధోనీ ఎత్తుకుని ఆడించాడు. ఈ సందర్భంగా దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివాదాలు, విభేదాలు దేశాల మధ్య కానీ మనుషుల మధ్య కాదని నిరూపించాడని సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశం-పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే.. చైనా, బంగ్లాదేశ్ మద్దతు ఎవరికి? (Video)

ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించాడు.. నదిలో దూకి పారిపోవాలనుకున్నాడు.. కానీ? (video)

30 నిమిషాల బ్లాక్‌అవుట్ డ్రిల్- పాక్ అలెర్ట్.. రెండు నెలలకు సరిపడా ఆహారం నిల్వ చేసుకోండి

Surgical Strike: ఫహల్గామ్ దాడి- పాకిస్తాన్‌పై మరో సర్జికల్ స్ట్రైక్.. నిజమేనా?

Pahalgam: కొలంబోలో పహల్గామ్ ఉగ్రవాదులు- చెన్నై నుంచి పారిపోయారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీరామ్ వేణు ను తమ్ముడు రిలీజ్ ఎప్పుడంటూ నిలదీసిన లయ, వర్ష బొల్లమ్మ

దుల్కర్ సల్మాన్ చిత్రం ఐ యామ్ గేమ్ తిరువనంతపురంలో ప్రారంభం

థగ్ లైఫ్.. ఫస్ట్ సింగిల్ జింగుచా రిలీజ్, సినిమా జూన్లో రిలీజ్

జగదేక వీరుడు అతిలోక సుందరి క్రేజ్, రూ. 6 టికెట్ బ్లాక్‌లో రూ. 210

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

తర్వాతి కథనం
Show comments