Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళల ప్రపంచ కప్.. సెమీస్ అవకాశాలు క్లిష్టతరం.. మహిళా జట్టు?

Webdunia
శనివారం, 19 మార్చి 2022 (16:23 IST)
మహిళల ప్రపంచ కప్‌లో టీమిండియా మహిళా జట్టు సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ పరాజయం పాలైంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో గెలవాల్సిందిపోయి.. ఓటమిని చవిచూసింది. 
 
దీంతో ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో గెలుపొంది సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 277 పరుగులు చేసింది. మిథాలీరాజ్ (68), యస్తికా భాటియా (59), హర్మన్ ప్రీత్‌కౌర్ (57 నాటౌట్), పూజా వస్త్రాకర్ (34) రాణించారు.
 
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆసీస్ 49.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 280 పరుగులు చేసింది విజయం సాధించింది.  ఈ ఓటమితో టీమిండియా సెమీస్ ఆశలు దాదాపుగా గల్లంతయ్యాయి.
 
ఒకవేళ సెమీస్‌కు వెళ్లాలంటే తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో భారత్ తప్పకుండా గెలవాల్సి ఉంటుంది. మంగళవారం బంగ్లాదేశ్, ఆదివారం సౌతాఫ్రికాతో విజయం సాధించాలి. 
 
అంతేకాదు న్యూజిలాండ్ తన తదుపరి మ్యాచ్‌లో ఓడిపోవాలి. ఇలా జరిగితేనే మనం సెమీస్‌ అవకాశాలు భారత్‌కు వుంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాత్రి బోయ్ ఫ్రెండ్ ఇంటికి వెళ్లింది, తెల్లారేసరికి శవమై కనబడింది, ఏమైంది?

Madhya Pradesh: ఏకలవ్య స్కూల్ ప్రిన్సిపాల్, లైబ్రేరియన్‌.. ఇద్దరూ జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు..(video)

వీడి దుంపతెగ... లైవ్ కాన్సెర్ట్‌లోనే కానిచ్చేశాడు.. (Video)

జస్ట్.. 4 రోజుల్లో పాకిస్థాన్ ఫినిష్.. కరాచీలో గురుకులాలు నిర్మించాల్సి వస్తుంది : రాందేవ్ బాబా

A Raja: డీఎంకే ఎంపీ ఎ రాజాకు తప్పిన పెను ప్రమాదం.. ఆ లైటు ఎంపీపై పడివుంటే? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

రజనీకాంత్ రిటైర్మెంట్ చేస్తారంటే... కామెంట్స్ చేసిన లతా రజనీకాంత్

బాలీవుడ్ నటులు అమ్ముడుపోయారు - ప్రకాష్ రాజ్ కామెంట్స్

తర్వాతి కథనం
Show comments