Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాలె చెస్ట్‌లో భారత్ ఘన విజయం...

గాలె వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించింది. మూడు టెస్టుల సిరీస్ లో 1-0తో టీమిండియా ఆధిక్యంలో నిల

Webdunia
శనివారం, 29 జులై 2017 (17:31 IST)
గాలె వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించింది. మూడు టెస్టుల సిరీస్ లో 1-0తో టీమిండియా ఆధిక్యంలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో శిఖర్ ధావన్ (190), ఛటేశ్వర్ పుజారా (153) సెంచరీలతో రాణించడానికి తోడు రహానే (57), హార్డిక్ పాండ్య (50), అశ్విన్ (47) ఆకట్టుకోవడంతో భారత్ 600 పరుగుల భారీ స్కోరు సాధించింది. 
 
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక తరంగ (64) మాధ్యూస్ (83), పెరీరా (92) పోరాడడంతో తొలి ఇన్నింగ్స్ 291 పరుగులు చేసింది. అనంతరం మరోసారి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కోహ్లీ (103) సెంచరీతో రాణించగా, అభినవ్ ముకుంద్ (81) ఆకట్టుకోవడంతో రెండో ఇన్నింగ్స్‌ను 240 పరుగుల వద్ద ముగించింది. అనంతరం 550 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంకను టీమిండియా బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు. 
 
అశ్విన్, జడేజా ధాటికి లంకేయులు కేవలం 245 పరుగులకే రెండో ఇన్నింగ్స్ ముగించారు. కరుణ రత్నే (97) సుదీర్ఘ ఒంటరి పోరాటం చేశాడు. డిక్ వెల్లా (67), మెండిస్ (36) నుంచి చక్కని సహకారం లభించింది. పెరీరా (21) నాటౌట్‌గా నిలిచాడు. దీంతో శ్రీలంక జట్టు 304 పరుగుల తేదాతో తొలి టెస్టులో పరాజయం పాలైంది. ఈ టెస్టులో 6 వికెట్లతో జడేజా రాణించగా, నాలుగు వికెట్లతో అశ్విన్ సత్తాచాటాడు. షమి మూడు వికెట్లు, ఉమేష్ యాదవ్ రెండు వికెట్లు, పాండ్య ఒక వికెట్ తీశారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Big Boss in AP Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణం-బిగ్ బాస్ జగన్‌ను జైలుకు పంపాలి సోమిరెడ్డి కామెంట్స్

Leopard : తిరుమలలో చిరుతపులి కదలికలు- భయాందోళనలో భక్తులు- టీటీడీ అలెర్ట్

KTR: తెలంగాణలో రాహుల్ గాంధీ ఈ ప్రాంతాల్లో పర్యటించాలి.. కేటీఆర్ డిమాండ్

Telangana: మావోయిస్టులతో చర్చలు జరపండి.. హింస వద్దు.. లెఫ్ట్ పార్టీలు

Rahul Gandhi: ఇతరులు ఏమి చెబుతున్నారో వినడం నేర్చుకున్నాను.. రాహుల్ గాంధీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

తర్వాతి కథనం
Show comments