Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు భారత జట్టు.. పాత కాపులకు పిలుపు

సొంతగడ్డపై శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌కు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) భారత జట్టును ప్రకటించింది. వచ్చేనెల 16 నుంచి ఈ టెస్ట్ సిరీస్ ప్రారంభంకానుంది. తొలి టెస్ట్ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్‌

Webdunia
మంగళవారం, 24 అక్టోబరు 2017 (06:58 IST)
సొంతగడ్డపై శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌కు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) భారత జట్టును ప్రకటించింది. వచ్చేనెల 16 నుంచి ఈ టెస్ట్ సిరీస్ ప్రారంభంకానుంది. తొలి టెస్ట్ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్‌ వేదికకానుంది. 
 
ఈ నేపథ్యంలో శ్రీలంకతో జరిగే మొదటి రెండు టెస్టులకు 16 మంది సభ్యులలతో కూడిన భారత జట్టును ఎంపిక చేసింది. గత కొన్నాళ్లుగా పరిమిత ఓవర్ల క్రికెట్‌కు దూరంగా ఉన్న రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా తిరిగి జట్టులో స్థానం దక్కించుకున్నారు. 
 
ఈ యేడాది ఆరంభంలో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ సమయంలో మురళీ విజయ్‌కు గాయమైంది. శస్త్రచికిత్స కోసం యూకే వెళ్లిన విజయ్‌ ఐపీఎల్‌తో పాటు ఆ తర్వాత శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. సుదీర్ఘ విరామం తర్వాత మురళీ విజయ్‌ తిరిగి జట్టులో స్థానం దక్కించుకున్నాడు. అలాగే, ఈ యేడాది మార్చిలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో ఆడిన ఇషాంత్‌ శర్మకు కూడా స్థానం కల్పించారు. 
 
జట్టు వివరాలు : విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, మురళీ విజయ్‌, శిఖర్‌ ధావన్‌, ఛటేశ్వర పుజారా, రహానె(వైస్‌ కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, సాహా, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్య, మహమ్మద్‌ షమి, ఉమేశ్‌ యాదవ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, ఇషాంత్‌ శర్మ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

తర్వాతి కథనం
Show comments