Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరాట్ కోహ్లీ చేతుల్లో ట్రోఫీ పెట్టి వెళ్లిపొమ్మన్నారు...

Webdunia
శనివారం, 19 జనవరి 2019 (09:48 IST)
ఆస్ట్రేలియా గడ్డపై కొత్త శకం లిఖించిన భారత క్రికెట్ జట్టుకు ఈ టోర్నీ నిర్వాహకులు ఉత్తిచేతులతో పంపనున్నారు. టోర్నీ విజేతగా నిలిచిన భారత జట్టుకు కేవలం ట్రోఫీ మాత్రమే ఇచ్చారు. పైసా నగదు బహుమతి ఇవ్వలేదు. దీన్ని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తప్పుబట్టారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఈ సిరీస్ ద్వారా నిర్వాహక బోర్డు భారీ ఆదాయాన్ని అర్జించిందన్నారు. ఇలా సంపాధించిన డబ్బులో ఆటగాళ్లకు కూడా వాటా ఉంటుందన్నారు. శుక్రవారం జరిగిన వన్డే మ్యాచ్‌లో 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు ద్వారా 500 అమెరికా డాలర్లను పొందిన కుల్దీప్ యాదవ్, 'ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌' అవార్డు పొందిన ఎంఎస్‌ ధోనీ తనకు వచ్చిన 500 అమెరికా డాలర్లను ఛారిటీ సంస్థకు విరాళంగా అందించారు. 
 
విజేతగా నిలిచిన భారత జట్టుకు కేవలం ఒక ట్రోఫీని బహుకరించారు. దీంతో గవాస్కర్‌ నిర్వాహకుల వైఖరిని తప్పుబడుతూ.. 'వన్డే సిరీస్‌ గెలిచిన భారత్‌కు నగదు బహుమతి ఏమీలేకుండా… ట్రోఫీ మాత్రమే ఇవ్వడం విచారకరం. నిర్వాహకులు టీవీ ప్రసార హక్కులను అమ్మి లెక్కలేనంత రాబడిని పొందుతున్నారు. విజేతలకు వారు ఎందుకు చెప్పుకోదగ్గ నగదును ఇవ్వరు. ఈ ఆటలో పాలుపంచుకునే ఆటగాళ్లందరూ ఈ మనీ రావడానికి కారణం కాదా' అంటూ సునీల్ గవాస్కర్ ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కొనియాడిన మంత్రి నారా లోకేష్

మానవత్వం చాటిన మంత్రి నాదెండ్ల మనోహర్.. కాన్వాయ్ ఆపి మరీ..

మావోయిస్టులు ఆయుధాలు వదులుకోకపోతే చర్చలు జరపబోం.. బండి సంజయ్

నలుగురు పిల్లలకు తండ్రి.. ప్రియురాలికి పెళ్లి నిశ్చమైందని యాసిడ్ దాడి.. ఎక్కడ?

RK Roja: ఆర్కే రోజాపై భూ ఆక్రమణ ఫిర్యాదులు.. టీడీపీని ఆశ్రయించిన బాధితులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

తర్వాతి కథనం
Show comments