Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంగ్లాండ్-భారత్ వన్డే సిరీస్.. తొలి వన్డేలో శిఖర్ ధావన్ ఫిఫ్టీ మార్క్

Webdunia
మంగళవారం, 23 మార్చి 2021 (16:09 IST)
టెస్టు, టి20 సిరీస్‌లను సొంతం చేసుకున్న టీమిండియా పరిమిత ఓవర్ల సిరీస్‌పై కన్నేసింది. ఇంగ్లాండ్-భారత్ మధ్య మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆరంభమైంది. పుణేలోని మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో రెండు జట్లు తలపడుతున్నాయి. 
 
ఇంగ్లాండ్‌తో తొలి వన్డేలో మొదట
Team India
బ్యాటింగ్‌ చేస్తున్న భారత్‌ నిలకడగా ఆడుతోంది. టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్.. అదిల్‌ రషీద్‌ వేసిన 24వ ఓవర్‌ తొలి బంతికి సిక్సర్‌ బాది అర్ధశతకం సాధించాడు. 68 బంతుల్లో 5ఫోర్లు, సిక్సర్‌ సాయంతో ఫిఫ్టీ మార్క్‌ చేరుకున్నాడు. ఇంగ్లీష్‌ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ పరుగులు రాబడుతున్నాడు. 
 
మరో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(28)తో కలిసి తొలి వికెట్‌కు 64 పరుగులు జోడించాడు. ప్రస్తుతం ధావన్‌, విరాట్‌ కోహ్లీ భారీ భాగస్వామ్యం నెలకొల్పే దిశగా వీరిద్దరి బ్యాటింగ్‌ సాగుతోంది. 24 ఓవర్లకు భారత్‌ వికెట్‌ నష్టానికి 109 పరుగులు చేసింది. కోహ్లీ(27), ధావన్‌(52) క్రీజులో ఉన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

ఆ పూజారి కాలితో తన్నించుకుంటే మోక్షం కలుగుతుందట... ఎక్కడ?

మే నెలలో అమరావతిలో పర్యటించనున్న ప్రధాని మోడీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

తర్వాతి కథనం
Show comments