Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేతిలో ఐదు వికెట్లు ఉన్నా.. కానీ 338 రన్స్ చేయలేని దుస్థితి... గంగూలీ విమర్శలు

Webdunia
సోమవారం, 1 జులై 2019 (16:48 IST)
ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా ఆదివారం బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లండ్, భారత్ క్రికెట్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఇందులో తొలుత టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి భారత్ ముగింట 337 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని ఉంచింది. ఆ తర్వాత 338 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కోహ్లీ సేన కేవలం 306 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా 36 పరుగుల తేడాతో ఈ ప్రపంచ కప్‌లో తొలి ఓటమిని చవిచూసింది. 
 
ఆ సమయంలో కామెంటేటర్స్ బాక్సులో భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్‌ల ఆసక్తికర సంభాషణ జరిగింది. అపుడు నాసిర్ హుస్సేన్ అడిగిన ప్రశ్నకు గంగూలీ సమాధానమిస్తూ, ధోనీ ఆటతీరు గురించి చెప్పడానికి తన వద్ద ఎలాంటి వివరణ లేదన్నారు. 
 
ముఖ్యంగా చేతిలో ఐదు వికెట్లు ఉన్నప్పటికీ 338 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించలేని స్థితిలో భారత బ్యాట్స్‌మెన్లు ఉన్నారంటూ దుయ్యబట్టారు. ముఖ్యంగా, ధోనీ సింగిల్స్ తీస్తూ అతి నెమ్మదిగా బ్యాటింగ్ చేయడంపై సౌరవ్ విమర్శలు గుప్పించారు. నిజానికి భారత క్రికెట్ జట్టు 300 పరుగులకు ఆలౌట్ అయివున్నా తాను బాధపడేవాడినని కాదని, కానీ ఐదు వికెట్లు చేతిలో ఉండగా కూడా ఇలా ఆడటం ఏంటని ధోనీ, కేదార్ జాదవ్ ఆటతీరును గంగూలీ దుయ్యబట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan Predicts: 2029లో కాదు, ఎప్పుడైనా ఎన్నికలు జరగవచ్చు: జగన్మోహన్ రెడ్డి జోస్యం

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్.. కీలక పరిణామం.. ఏంటది?

భారత్-పాక్ యుద్ధాన్ని ఆపేందుకు ఆదివారం పాకిస్తాన్ వెళ్తున్నా: పాల్

OTTs : పాకిస్తాన్ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లను బంద్ చేయాలి.. కేంద్రం ఆదేశం

Operation Sindoor: 100 మందికి పైగా ఉగ్రవాదులు హతం.. ఆపరేషన్ ఆగదు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

తర్వాతి కథనం
Show comments