Webdunia - Bharat's app for daily news and videos

Install App

బయో-సెక్యూర్ బబుల్‌లోకి భారత క్రికెటర్లు.. జూన్ 2న ఇంగ్లండ్ గడ్డపైకి కోహ్లీ సేన

Webdunia
మంగళవారం, 25 మే 2021 (21:03 IST)
ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా క్రికెటర్లు అడుగుపెట్టనున్నారు. ఇంగ్లాండ్ టూర్ ముంగిట టీమిండియా బయో- సెక్యూర్ బబుల్‌లోకి భారత క్రికెటర్లు ఎంటరయ్యారు. ఇంగ్లాండ్ టూర్‌కి ఎంపికైన భారత క్రికెటర్లు ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ వేయించుకున్నారు. సెకండ్ డోస్ మాత్రం ఇంగ్లాండ్ గడ్డపై క్రికెటర్లు వేయించుకోనున్నట్లు బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. 
 
ఈ నేపథ్యంలో జూన్ 2న ఇంగ్లాండ్‌ గడ్డపైకి వెళ్లనున్న కోహ్లీ కెప్టెన్సీలోని భారత టెస్టు జట్టు.. అక్కడ సౌథాంప్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జూన్ 18 నుంచి 23 వరకూ ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో తలపడి.. ఆ తర్వాత ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 10 వరకూ ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో ఢీకొట్టబోతోంది. ఈ మేరకు 20 మందితో కూడిన జట్టుని భారత సెలెక్టర్లు ప్రకటించారు. 
 
భారత టెస్టు జట్టులోకి ఎంపికైన ఆటగాళ్లు ముంబయికి చేరుకున్నారు. ఈ మేరకు కరోనా వైరస్ పరీక్షలు చేయించుకున్న ఆటగాళ్లు.. హోటల్‌లో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఏర్పాటు చేసిన బయో- సెక్యూర్ బబుల్‌లోకి ఎంటరయ్యారు. ఏడు రోజుల పాటు ఆటగాళ్లు గదికే పరిమితం కానుండగా.. అందులో వారికి అవసరమైన సౌకర్యాల్ని ఏర్పాటు చేసినట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. 
 
ఈ ఏడు రోజుల వ్యవధిలో మరో రెండు సార్లు క్రికెటర్లకి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ రెండింటిలోనూ నెగటివ్ వచ్చిన ఆటగాళ్లు.. జూన్ 2న ఇంగ్లాండ్‌కి ఛార్టర్ ప్లైట్‌లో బయల్దేరి వెళ్లనున్నారు. ఒకవేళ ఈ పరీక్షల్లో పాజిటివ్ తేలిన క్రికెటర్.. టూర్ నుంచి తప్పుకోనున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్‌ చేపట్టిందా?.. సిగ్గులేదా ఆ మాట చెప్పడానికి.. పాక్‌ను ఛీకొట్టిన దేశాలు...

కాశ్మీర్‌లో సాగుతున్న ఉగ్రవేట... ఆయుధాలతో ఇద్దరి అరెస్టు - యుద్ధ సన్నద్ధతపై కీలక భేటీ!!

సజ్జల రామకృష్ణారెడ్డి భూదందా నిజమే.. నిగ్గు తేల్చిన నిజ నిర్ధారణ కమిటీ

Insta Friend: ఇన్‌స్టా ఫ్రెండ్.. హోటల్ గదిలో వేధించాడు.. ఆపై వ్యభిచారం

Pawan Kalyan: తమిళనాడు మత్స్యకారులపై దాడులు.. పవన్ కల్యాణ్ స్పందన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

Ram Charan: రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. ఫ్యామిలీతో లండన్‌కు చెర్రీ ఫ్యామిలీ

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

తర్వాతి కథనం
Show comments