Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యూజిలాండ్ 401 పరుగుల భారీ స్కోరు.. అయినా ఓడిపోయింది.. ఎందుకని?

Webdunia
శనివారం, 4 నవంబరు 2023 (22:54 IST)
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో శనివారం రెండు మ్యాచ్‌ కీలక మ్యాచ్‌లు జరిగాయి. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్, న్యూజిలాండ్‌ జట్లు తలపడగా, రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు పోటీపడ్డాయి. ఇందులో పాకిస్థాన్ జట్టును వరుణ దేవుడు గెలిపించారు. ఇంగ్లండ్ మరోమారు ఓటమిని చవిచూసింది.
 
సెమీస్‌కు వెళ్లాలంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌కు వరుణ దేవుడు సాయం చేశాడు. 402 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు ఆరంభంలోనే షాక్ తగిలినా బెదిరిపోలేదు. అద్భుత ఫామ్‌లో ఉన్న ఓపెనర్ అబ్దుల్లా షఫీఖ్ 4 పరుగులకే అవుట్ కావడంతో ఆరు పరుగుల వద్ద పాకిస్థాన్ తొలి వికెట్ కోల్పోయింది. 
 
అయితే మరో ఓపెనర్ ఫకార్ జమాన్ చెలరేగి ఆడాడు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో భారీ వర్షం కురవడానికి ముందే సిక్సర్ల వర్షం కురిపించాడు. 81 బాల్స్‌లో 8 ఫోర్లు, 11 సిక్సర్లతో 126 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కానీ వర్షం రెండు సార్లు అంతరాయం కలిగించింది. తొలిసారి వర్షం తగ్గిన తర్వాత పాకిస్థాన్ టార్గెట్‌ను 41 ఓవర్లలో 342 పరుగులుగా అంపైర్లు నిర్ణయించారు.
 
కాగా పాకిస్థాన్ 25.3 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 200 పరుగులు చేసి విజయం దిశగా దూసుకెళ్తున్న సమయంలో మరోసారి వర్షం అంతరాయం కలిగించింది. అప్పటికి జమాన్ (126 నాటౌట్), బాబర్ ఆజమ్ (66 నాటౌట్) క్రీజులో ఉన్నారు. ఎంతసేపటికీ వర్షం తగ్గకపోవడంతో రాత్రి 7:40 గంటలను కటాఫ్ టైమ్‌గా అంపైర్లు ప్రకటించారు. అప్పటిలోగా మ్యాచ్ మరోసారి ప్రారంభం కాకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 21 పరుగుల తేడాతో పాకిస్థాన్ గెలిచినట్లు అంపైర్లు వెల్లడించారు. 
 
సెమీస్‌కు వెళ్లాలంటే అటు న్యూజిలాండ్, ఇటు పాకిస్థాన్ తమ చివరి మ్యాచ్‌లో గెలిచి తీరాలి. న్యూజిలాండ్ తమ ఆఖరి మ్యాచ్‌ను శ్రీలంకతో ఆడాల్సి ఉండగా.. పాకిస్థాన్ తమ చివరి మ్యాచ్‌ను ఇంగ్లండ్‌తో ఆడాల్సి ఉంది. అయితే పాకిస్థాన్ భారీ తేడాతో గెలవాలి. ఎందుకంటే నెట్ రన్‌రేట్ వాళ్లకు మైనస్‌లో ఉంది.
 
మరో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ ఓడిపోయింది. ఆసీస్ నిర్దేశించిన 286 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ జట్టు 253 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 33 పరుగుల తేడాతో ఆసీస్ గెలుపొందింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో పాకిస్థాన్ ఎక్కడెక్కడ దాడులు చేస్తుంది? హైదరాబాద్ - వైజాగ్‌లు ఏ కేటగిరీలో ఉన్నాయి?

రిజర్వేషన్ వ్యవస్థ రైలు కంపార్టుమెంట్‌లా మారిపోయింది : సుప్రీం జడ్జి సూర్యకాంత్

భారతదేశం-పాకిస్తాన్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరుగుతుందా?

Jagan Padayatra 2.0 : 2027లో పాదయాత్ర 2.0 చేపడతారు.. గుడివాడ అమర్‌నాథ్

భారత్ దెబ్బకు ఎండిపోతున్న పాక్ నదులు... ఖరీఫ్ సీజన్ నుంచే నీటి కటకటా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

తర్వాతి కథనం
Show comments