Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత క్రికెటర్ల భార్యలు తన్నుకున్నారా? శాస్త్రి ఏమంటున్నారు?

Webdunia
మంగళవారం, 30 జులై 2019 (13:12 IST)
ఇటీవల ఇంగ్లండ్ వేదికగా ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ పోటీలు జరుగనున్నాయి. ఈ పోటీల్లో భారత క్రికెట్ జట్టు సభ్యులు పాల్గొన్నారు. అలాగే, వారివారి భార్యలు కూడా క్రికెటర్లతో ఉండేందుకు బీసీసీఐ అనుమతిచ్చింది. అయితే, ఇపుడు సరికొత్త రూమర్ ఒకటి వెలుగులోకి వచ్చింది. 
 
భారత క్రికెటర్ల భార్యలు కొట్టుకున్నట్టు ఆ రూమర్ సారాంశం. ఈ కారణంగా క్రికెటర్ల భార్యల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయని పలు కథనాల్లో వచ్చాయి. వీటిపై భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి స్పందించారు. 
 
వెస్టిండీస్ పర్యటనకు టీమిండియా బయలుదేరింది. ఈ  సందర్భంగా రవిశాస్త్రి ముంబైలో ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడుతూ, ఇవన్నీ అసత్య వార్తలు అని కొట్టిపడేశారు. రానున్న రోజుల్లో ఆటగాళ్ల భార్యలు బ్యాటింగ్ చేస్తున్నారని, బౌలింగ్ చేస్తున్నారనే వార్తలను కూడా చదవాల్సి వస్తుందేమోనని సెటైర్ వేశారు. 
 
మన జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో కూడా ఎలాంటి వివాదాలు చోటుచేసుకోలేదని చెప్పారు. క్రికెట్ కంటే ఏ ఆటగాడు గొప్ప కాదని రవిశాస్త్రి అన్నారు. తాను కానీ, ఏ ఆటగాడైనా కానీ గొప్ప కాదని చెప్పారు. అన్ని ఫార్మాట్లలో టీమిండియా అద్భుతంగా రాణిస్తోందని అన్నారు. ప్రపంచకప్‌లో కూడా మన జట్టు అద్భుతమైన ఆటతీరును కనబరిచిందని చెప్పారు. 
 
గత 18 నెలల్లో టెస్టుల్లో అద్భుతంగా రాణించామని, వన్డేల్లో పరుగుల వరద పారించామని తెలిపారు. టెస్టుల్లో నెంబర్ వన్ స్థానంలో ఉన్నామని, వన్డేల్లో నెంబర్ టూగా ఉన్నామని, టీ20ల్లో కొంత మెరుగు పడాల్సి ఉందని చెప్పారు. ప్రపంచకప్‌లో గెలిచి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని... ఓడినంత మాత్రాన మన ఆటగాళ్ల ప్రదర్శనను తక్కువ చేసి మాట్లాడలేమని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

ఆపరేషన్ సిందూర్‌ కోసం ఉపయోగించిన యుద్ధ విమానాలు ఏవి?

Operation Sindoor ఆపరేషన్ సింధూర్: పాకిస్తాన్‌లోని అమెరికా పౌరులు జాగ్రత్త..

పహల్గాం దాడితో యావత్ దేశం రగిలిపోయింది : భారత విదేశాంగ శాఖ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

21 సంవత్సరాలా క్రితం ఆర్య టీమ్ ఎలా వున్నారో చూడండి

ఆధ్యాత్మిక తీర్థయాత్రలతో అందరికీ కనెక్ట్ అవ్వడానికి యూఎస్ఏ టూర్ లో మంచు విష్ణు

తర్వాతి కథనం
Show comments